Publish Date:Nov 20, 2024
మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో బీజేపీ జయకేతనం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఈ సారి ఎన్నికలలో జార్ఖండ్ లో బీజేపీ 42నుంచి 48 స్థానాలలో విజయం సాధించి సాధారణ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించు కుంటుందని పేర్కొంది. 16 నుంచి 23 స్థానాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా రెండో స్థానంలోనూ 8 నుంచి 14 స్థానాలతో కాంగ్రెస్ మూడో స్థానంలోనూ నిలుస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో కూడా బీజేపీ నాయకత్వంలోని మహాయతి కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. బుధవారం అన్ని స్థానాలకూ కలిపి ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా జేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడీ మధ్య పోరు సాగింది. తొలి అంచనాల ప్రకారం ఈ ఎన్నికలలో హోరాహోరీ తప్పదని అంతా భావించినా పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీ నేతృత్వంలోని మయాయతి కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందని తేలింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయత కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ 85 నుంచి 112 స్థానాలకే పరిమితం ఔతుంది.
మహాయతి కూటమిలో బీజేపీ సొంతంగా 102 నుంచి 120 స్థానాలలోనూ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 46 నుంచి 51 స్థానాలలోనూ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 నుంచి పాతిక స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ సొంతంగా 24 నుంచి 44 స్థానాలలోనూ, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 21 నుంచి 31 స్థనాలలలోనూ, శరద్ పవాన్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 28 నుంచి 41 స్థనాలలోనూ విజయం సాధిస్తుంది. ఇతరులు 6 నుంచి 12 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jarkhand-and-maharashtra-vote-for-bjp-39-188704.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.