జనసేనాని బ్యాలెన్స్ తప్పుతున్నారా?

Publish Date:Mar 15, 2025

Advertisement

తెలుగు తమ్ముళ్ల చురకలు

ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ  స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.ఆ మాటలు పవన్  మరచిపోయినట్టున్నారు. రోజులు  గడిచే కొద్దీ డిప్యూటీ సీఎం బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్‌కళ్యాణ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కాన్ఫిడెన్స్ లెవల్స్ మరీ ఎక్కువై పోయాయని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రావణుడి లాంటి దుష్టుడిని మట్టుపెట్టడానికి రామ -  సుగ్రీవులు కలిశారు . అలాంటి వానర సైన్యం లేకపోతే సీతారాములు కలిసేవారు కాదు అనుకుంటే పొరపాటే అని యద్దేవా చేస్తున్నారు .

బాబుగారు ఒదిగి వున్నారు కదా అని అంతా మేమే చేసాం, అంతా మా ఘనతే అనకండని చురకలు అంటిస్తున్నారు. మీకు కృతజ్ఞత ఉంటే మీ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ వచ్చేలా చేసేవారని చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్బంగా పాత ఎన్నికల లెక్కలు బయటకు తీసి మీ సత్తా ఇదీ అని జనసేనానికి గుర్తు చేస్తున్నారు.

2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్, జనసైనికుల ఫ్యాక్టర్స్‌తో గాజువాకలో జనసేనకు వచ్చిన ఓట్లు 58,539. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధికి పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 56,642. 75,292  ఓట్లు దక్కించుకున్న వైసీపీ 16,753 ఓట్ల మెజార్టీతో గట్టెక్కింది. 2024లో  తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస రావుకి వచ్చిన ఓట్లు 1,57,703. వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 62,468. ఒకవేళ జనసేన లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడొచ్చిన ఓట్లలో గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు తీసేసినా టీడీపీకి 99,164 ఓట్లు దక్కేవి. ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 95,235. అందులో 2019 నాటి జనసేన షేర్ 58,539 తీసేస్తే తక్కువలో తక్కువ 35 వేలు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేది.

 2019లో  పీఠాపురంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 28,011. టీడీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 68,467. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 83,459. 2024లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,34,394. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 64,115 . ఒకవేళ టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండి ఉంటే 1,34,394 - 68,467= 65,927 ఓట్లు జనసేనకు దక్కేవి. అప్పుడు పవన్‌కళ్యాణ్‌కి 10 వేల లోపే మెజారిటీ దక్కేది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుని గెలిచిన భీమవరం లెక్కలు కూడా తీయవచ్చు కాని, చదివేవారికి బోరు కొడుతుంది వద్దులే. ఫ్యాక్టర్స్ మాట్లాడే ముందు ఫ్యాక్ట్ తెలుసుకో..మిడిసిపడే దీపం ఎక్కువసేపు వెలగదు.. అని తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రికి హితబోధ చేయడం మొదలుపెట్టారిప్పుడు.

By
en-us Political News

  
నటుడిగా, నాయకుడిగా అంతకు మించి గొప్ప దార్శనికుడిగా ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించారు. జూనియర్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు.
కడన వేదికగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు తీర్మానం ప్రవేశ పెడతారు.
తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్ తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్‌ రీఇంజినీరింగ్‌, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు.
పైకి జంతుప్రేమికురాలిగా నటిస్తూ.. కుక్కలను చంపి తింటున్న మహిళ ఉదంతం చైనాలో వెలుగు చూసింది. గతంలో చైనాలో కుక్క మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. కరోనా అనంతరం నిబంధనలు కఠినతరం చేసారు. కుక్కమాంసం తినడం పై నిషేధం విధించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు.
తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.
తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమని ముఖ్యమంత్రి అన్నారు.
మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు ఇండియన్ రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని మంత్రి టీజీ భరత్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.