ఈ మధ్య పవన్ కళ్యాన్ బాగా పొసెసివ్ అయిపోయారు. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని తెలిసిన వెంటనే ఆయన మెట్లు కడిగి ప్రక్షాళన చేశామనడంతో.. ఇప్పుడు సిట్ చార్జిషీట్ తరువాత వైసీపీ నాయకత్వం ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నానా యాగీ చేసిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ వైసీపీయులు తెగ హడావుడి చేస్తున్నారు. సనాతన అంటూ ఒక బిరుదు ముందు చేర్చి మరీ ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసైనికులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటికీ నేనే స్పందించాలంటే మీరెందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎక్కడున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
ఇక అంబటి రాంబాబు అరెస్టుపై పవన్ రియాక్ట్ కావాలంటూ.. వైసీపీ డిమాండ్ చేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబును ఎలివేట్ చేయడానికి వంగవీటి రంగా బొమ్మ తెరపైకి తేవడం పవన్ కల్యాణ్ ను ఒకింత ఇబ్బందుల్లో పడేసిందని పరిశీలకులు అంటున్నారు. ఒక్క అంబటి రాంబాబు విషయమని కాదు కానీ తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేషనల్ గా హేతుబద్ధంగా స్పందిస్తుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం తడబడుతున్నారు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడిలా దూసుకెళ్లిపోవడం కాదు.. అర్జనుడిలా దాన్ని ఛేదించాలని జనసేన క్యాడర్ అంటున్నది.ఏ అంశంపైనైనా దూకుడుగా ముందుకు వెళ్లగలిగిన పవన్ కల్యాణ్.. విమర్శలకు దీటుగా స్పందించి ప్రత్యర్థుల నోళ్లు మూయించే విషయంలో మాత్రం ఒకింత వెనకబడుతున్నారనీ, ఆయన పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడి మాదిరిగా కనిపిస్తోందని అంటున్నారు. అయన తన తీరు మార్చుకుని అభిమన్యుడిలా కాకుండా అర్జనుడిలా నిలవాలని కోరుతున్నారు.
ఇటీవల కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మీడియా ప్రశ్నకు సమాధానం దాటవేయడం కానీ, అంతకు ముందు తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు మైక్ కట్ చేయనడం కానీ పవన్ కల్యాణ్ లో అసహనానికీ, దుందుడుకు తీరుకూ నిదర్శనాలుగా చెబుతున్నారు. ఏదైనా విషయంలో క్లారిటీ ఇవ్వకుండా దాటవేయడం రాజకీయాలలో రాణించదని అంటున్నారు.
గతంలో జగన్ పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై పదే పదే విమర్శలు చేసిన సందర్భంగా పవన్ కల్యాణ్ రా నిన్ను కూడా చేసుకుంటా నాలుగో పెళ్లి అని ఎంత ధైర్యంగా అన్నారో.. అలాగే అదే ధైర్యంతో అన్ని విషయాలలోనూ స్పందించాలని జనసేన కేడర్ కోరుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అర్జనుడిలా రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించుకురావాలి కానీ అభిమన్యుడిలా ఆ పద్మవ్యూహంలో చిక్కుకోకూడదని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janasena-cadre-say-pawan-not-abhmanyu-39-213424.html
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.