హైదరాబాద్ వాసులకు జానారెడ్డి హామీలు

Publish Date:Aug 14, 2013

Advertisement

 

తెలంగాణా ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డిని, టీ-కాంగ్రెస్ నేతలు కానీ, తెరాస గానీ, ఉద్యమంలో ఉన్నవారు గానీ ఎవరూ ఎన్నడూ నమ్మలేదు. ఆయన తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారనే అపవాదు కారణంగానే ఎవరూ కూడా ఆయన మాటలను విశ్వసించలేకపోయారు. అటువంటి ఆయన ఇప్పుడు సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు యావత్ టీ-మంత్రుల తరపున ఒక గొప్ప హామీ ఇచ్చారు.

 

ఎపి ఎన్జీఓలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారి భద్రతకు తానూ పూర్తి భరోసా ఇస్తున్నానని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ నివసిస్తున్న ఆంద్ర, రాయలసీమ వాసులకు ప్రజలకు ఉండదలిచిన వారెవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని అందుకు తాను హామీ అని అన్నారు. అవసరమైతే వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి అందుకు తగిన అన్ని చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

 

ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తున్నఆంధ్ర ఉద్యోగులు ఏవిధంగాను నష్టపోకుండా వారికి తగిన సదుపాయాలు, సర్వీస్ నిబంధనలను అమలుచేస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా ఒకే కుటుంబంగా కలిసి ఉంటామని ఆయన చెప్పారు. ఎన్.జి.ఓలకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాకేంద్రం నియమించిన అంటోనీ కమిటీకి తెలియచేయాలని, వెంటనే వారు తమ సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

 

ఇటువంటి హామీలు కాంగ్రెస్ నేతలే కాదు, తెరాస నేతలు సైతం ఇస్తున్నసంగతి ఆయనకీ తెలిసే ఉండాలి. కానీ, వారి మాటలకు చేతలకు చాలా తేడా కనబడుతున్న విషయం కూడా ఆయనకి తెలిసే ఉండాలి. ఒకవైపు ఆంధ్ర ప్రజలను ఎవరూ బయటకి పొమ్మనలేదని చెపుతూనే ‘కబడ్దార్ కొడకల్లారా!’ అంటూ అదే నోటితో ప్రజలను భయపెడుతున్నకొందరు అతివాద నేతల ఆలోచనలను జానారెడ్డి వంటి వారే కాదు సాక్షాత్ ప్రధాని హామీ ఇచ్చినా భద్రత ఉండదు.

 

అందువల్లే హైదరాబాద్ లో స్థిరపడిన ప్రజలు తీవ్ర అభద్రతా భావంతో బాధపడుతున్నారు. తెరాస నేతలు చేపట్టిన ఉద్యమంతో ప్రజల మధ్య అగాధం ఏర్పడింది. ఇప్పటికే, స్థానికంగా విద్యా ఉద్యోగ విషయాలలో తీవ్ర వివిక్షను ఎదుర్కొంటున్నఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులకు, జానారెడ్డి వంటి వారిచ్చే హామీలు ఎటువంటి న్యాయం, భద్రతను కల్పించలేవని ఖచ్చితంగా చెప్పవచ్చును. కేవలం చట్టపరమయిన రక్షణలు మాత్రమే వారి భయాలను కొంత మేరయిన తగ్గించగలవు. అయితే, ఇది తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే సాధ్యం గనుక, అంతవరకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని అక్కడి ప్రజల కోరుతున్నారు.

 

దీనికి సరయిన పరిష్కారం కనుగొనకుండా ముందుకు సాగినట్లయితే, హైదరాబాదులో తరచూ చెలరేగే మత ఘర్షణల వలెనే, ఆంధ్ర తెలంగాణా ప్రాంత ప్రజల మధ్య కూడా తరచూ ఘర్షణలు, ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంటుంది.

By
en-us Political News

  
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.