జానారెడ్డి పార్టీ మారడానికే ఇలా చేస్తున్నారా?

Publish Date:Oct 11, 2015

Advertisement

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గులాబీ రంగు పూసుకోనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారా? అంటే అవునని కొంత మంది రాజకీయ నేతలు అనుకుంటున్నారు. తెలంగాణ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జానారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దపడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.

ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నా పెద్ద ప్రయోజనం లేదని అనుకున్నారేమో పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది జానారెడ్డి. దీనిలో భాగంగానే ముందునుంచి ఆయన పార్టీ వ్యవహారాలను కూడా అంతగా పట్టించుకోవడం.. దీనిపై ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనమీద ఆగ్రహంగా ఉండటం అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అంతేకాక అధికార పార్టీ.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినా అధికార పార్టీని పల్లెత్తు మాటకూడా అనకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలకడం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో అధికార పార్టీకి క్షమాపణలు చెప్పిండటం.. ఇవన్నీ ఆయన పార్టీపై మరింత అనుమానాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు అన్నిపార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్న చేపట్టిన తెలంగాణ బంద్ కు జానారెడ్డి డుమ్మాకొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల కోపం నషాళానికి అంటింది.

అయితే జానారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ వాదినే అని  ఎవరి సర్టిఫికెట్టూ తనకు అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం జానారెడ్డి తీరుపై చాలా అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో రాహుల్ గాంధీ కూడా జానారెడ్డితో ఏం సార్ పార్టీ మారుతున్నారా అని కూడా సెటైర్లు వేశారు. అయితే కొంతమంది మాత్రం జానారెడ్డి పార్టీ మారేందుకు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. కావాలనే అధిష్టానంతోనూ.. పార్టీ నేతలనూ కయ్యం పెట్టుకోవడానికి చూస్తున్నారని అనుకుంటున్నారు. అయితే కేంద్రం తనంతట తానుగా పంపించినా.. లేక తాను స్వయంగా వెళ్లిపోయినా తనకే మంచిదని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలతో పాటు పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి రాజకీయానుభవం జానాకు బాగానే వర్కవుట్ అయినట్టు ఉంది. మరి జానా కూడా పార్టీ మారే రోజు తొందరలోనే ఉందని తెలుస్తోంది.

By
en-us Political News

  
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.