పార్లమెంటులో ‘జమిలి బిల్లు‘ ఎప్పుడంటే?

Publish Date:Oct 18, 2024

Advertisement

కేంద్రంలో కొలువుదీరి ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్  జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మోడీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ జమిలి ఎన్నికల జపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత జమిలి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణకు వేగవంతం చేశారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సమాయత్తమౌతున్నారు.   మూడోసారి ఎన్డీఏ  అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  తమ ఎజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని,అందుకోసం పార్లమెంట్లో త్వరలో బిల్లు పెడతామని  బీజేపీ ఖరాఖండిగా చెబుతున్నది. ఇందుకు భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా కూడగట్టింది. లోక్ సభలో ఓకే.. అయితే ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే అవసరమైన బలం సమకూర్చుకునేందుకు ఇప్పటి వరకూ ఆగింది. అయితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ సర్కార్ కు అవసరమైన బలం చేకూరింది. మిత్రపక్షాల అంటే భాగస్వామ్య పక్షాల మద్దతుతో  సునాయాసంగా బిల్లులకు ఆమోదం పొందగలిగే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ప్రధానంగా ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీ ఎన్నికల  నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల  పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీని నియమించింది.  ఆ కమిటీ పరిశీలన జరిపి ఇటీవల నివేదిక ఇచ్చింది.ఆ నివేదిక లో ఏమి ఉందో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఊహించేయవచ్చు.  ఎందుకంటే ఆ కమిటీ నియమించిన ఉద్దేశమే జమిలి నిర్వహణ సాధ్యమే అన్న నివేదిక ఇచ్చేందుకు.  

జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంట్,అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం. ఇలా జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఐదు ఆర్టికల్స్ 83,85,172,174,356 సవరణ చేయాలి. అలాగే లోక్ సభ,రాజ్యసభ లలో 67 శాతం సభ్యులు మద్దతు అవసరం.  అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలలో జమిలికి మద్దతుగా తీర్మానాలు చేయాలి. అప్పుడే జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి. మాటలమాంత్రికుడు మోదీ  ఈ టాస్క్ లో తప్పక విజయం  సాధిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జమిలీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే  2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. సాధారణంగా ఎన్నికలు  విడిగా  జరిగితే ప్రజలు లోక్ సభకు జాతీయ పార్టీలవైపు  అసెంబ్లీ ఎన్నికలలో  ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపుతారు.  స్థానిక ప్రభుత్వాలయితే ఎక్కువ ప్రయోజనం పాటు స్థానిక నాయకత్వం పెరుగుతుందని ప్రజలు ఆలోచిస్తారు.

కాని బీజేపీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే  ప్రజలు తమవైపే చూస్తారని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అంతే కాకుండా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉండటం బీజేపీకి గిట్టదు. ఆ విషయాన్ని పలు సందర్భాలలో బీజేపీ అగ్రనేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కూడా. ప్రాంతీయ పార్టీలు జాతీయ ప్రయోజనాలకు ఆటంకమన్నది బీజేపీ భావనగా కనిపిస్తోంది.   ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా  300 మార్క్ దాటలేకపోవడానికి కారణం కూడా ప్రాంతీయ పార్టీలేనన్నది బీజేపీ భావనగా ఉంది. అందేకే ఎలాగైనా  జమిలికి అనుకూలంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది..  జమిలితో సొంతంగా పూర్తి మేజార్టీ సాధించాలని ఆ పార్టీ ప్రణాళిక అన్నది పరిశీలకులు విశ్లేషణ.  అయితే బీజేపీ జమిలి వ్యూహం వెనుక శాశ్వతంగా అధికారాన్ని చేతుల్లో ఉంచుకునే కుట్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జమిలి ద్వారా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వైపు బీజేపీ ప్రయాణం సాగుతుందని అంటున్నారు.

ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు.  ఏదిఏమైనా జమిలీ వల్ల ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం వాటిల్లడం మాత్రం తథ్యమన్నది రాజకీయ పరిశీలకులు భావన.  అంతే కాదు ఫెడరల్ వ్యవస్థగా ఉన్న పార్లమెంటరీ విధానం నెమ్మదిగా యూనిటరీ విధానంగా మారుతుందని విశ్లేషణలు చేస్తున్నారు.యూనిటరీ విధానంతో అధికారం కేంద్రీకృతమై  నిరంకుశత్వానికి దారితీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు.  ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొవాలంటే ఇండియా కూటమి బలంగా రూపుదిద్దుకోవాలి.  అందుకు కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడాలి.  మొత్తం మీద జమిలి ఎన్నికలకు బీజేపీ తనదైన వ్యూహరచనతో మార్గం సుగమం చేసుకుంటుంటో.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.