వైసీపీకి జక్కంపూడి ఫ్యామిలీ దూరం?

Publish Date:Apr 5, 2025

Advertisement

రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య ఆధిపత్యపోరు పోరు తార స్థాయికి చేరుకుంది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్ఠను కూడా బజారున పడేస్తున్నది . ఎవరినీ సముదాయించలేక జగన్ సైలెంట్ అవ్వడంతో జక్కంపూడి రామ్మోహనరావు వారసుడు జక్కంపూడి గణేష్ పార్టీని వీడటానికి డిసైడ్ అయ్యారంట. 
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంట. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఆ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యపోరుకు మాత్రం తెర దించలేకపోయింది. భరత్, గణేష్‌ల టార్గెట్ ఒకటే. రాజమండ్రి వైసీపీలో తమ ఆధిపత్యం మాత్రమే ఉండాలని. ఈ ఆలోచనే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి రామ్మోహన్‌రావు చిన్న కొడుకు జక్కంపూడి గణేష్ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది.
జక్కంపూడి ఫ్యామిలీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి తూర్పుగోదావరి జిల్లాలో తెలియని రాజకీయ నాయకుడు ఉండడు. వైఎస్ సన్నిహితుడుగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జక్కంపూడి రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్ లు వైఎస్, జక్కంపూడి రమ్మోహన్‌రావు మరణాల తర్వాత వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు. 
మరోపక్క 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్ జగన్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. జగన్ ఆదేశిస్తే ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు వ్యవహరిస్తుంటారు . జక్కంపూడి ఫ్యామిలీకి వైఎస్‌కు అనుబంధం ఉంటే, మార్గాని భరత్ కు వైసిపి అధినేత జగన్ కు ప్రత్యేక అనుబంధం కనిపిస్తుంది . ఒకరేమో తండ్రి వైపు నుంచి వచ్చిన వాళ్ళు ... మరొకరు తన ప్రమేయంతో వచ్చిన నేత కావడంతో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాక జగన్ సైలెంట్ గా ఉండిపోతున్నారంట.
 వైసిపి అధిష్టానం సైలెంట్ గా ఉండడమే రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి, మార్గాని కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి కారణం అవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి  
 జక్కంపూడి రామ్మోహన్‌రావుకు ఆయన  రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి రాజమండ్రిపై పట్టుంది. జక్కంపూడి రామ్మోహన్‌రావు మరణం తర్వాత వైసీపీ నుండి బరిలోకి దిగి రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి తనయుడు రాజా పక్క నియోజకవర్గానికి వెళ్లినా ఆ ఫ్యామిలీ రాజమండ్రి పై ఫోకస్ మాత్రం తగ్గించ లేదు. జక్కంపూడి రాజా రాజానగరంపై దృష్టి పెడితే ఆయన తమ్ముడు,  ప్రస్తుత ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాత్రం పూర్తి ఫోకస్ రాజమండ్రి నగరం పైనే పెడుతూ వస్తున్నారు. 
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలవడం, వైసీపీ నుండి పార్లమెంటరీ కమిటీలో మార్గాని భరత్ కు కీలకమైన పదవి రావడంతో జక్కంపూడి గణేష్, మార్గాని భరత్ లు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్లు చలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షాలకు పలుచనవుతూ వచ్చారు. ఒకే పార్టీలో ఉన్న మార్గాని భరత్, జక్కంపూడి గణేష్ లు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఆ పార్టీ నేతలకే మింగుడుపడటం లేదంట.

మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వైరం పరిష్కరించలేని స్థాయికి చేరుకోవడంతో జక్కంపూడి గణేష్ వైసీపీలో కొనసాగడం కష్టంగా కనిపిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి రాజకీయాల్లో మార్గాని భరత్ వల్ల వైసీపీ ప్రతిష్ట దిగజారుతున్నదని, భరత్ వ్యవహార శైలి ఇదేవిధంగా ఉంటే వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని గణేష్ అంటున్నారు. అందుకే వైసీపీని వీడటానికి నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి అధిష్టానానికి చెప్పారంట. వైసీపీని వదిలి వేయడానికి గల కారణాలు, మార్గని భరత్ వల్ల వైసీపీకి జరుగుతున్న నష్టాలను బయట పెడతానని చెపుతుండటంతో ఆ పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

జక్కంపూడి ఫ్యామిలీ సభ్యుడు వైసీపీని వీడనుండటంపై  పార్టీలో కూడా ఇంటర్నల్ గా చర్చ  మొదలైందంట. ఇప్పటికే జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళుతున్నారు. వైసీపీని వీడుతున్న వారిలో అత్యధికులు వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ నుండి మాస్ లీడర్ గా పేరున్న జక్కంపూడి గణేష్ వైసిపికి రాజీనామా చేస్తే,  మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా  జగన్ స్పందించకపోవడమే జక్కంపూడి గణేష్ అలకకు కారణంగా చెప్తున్నారు 

By
en-us Political News

  
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.