దార్శనికుడు చంద్రబాబుకు జైలు.. వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి బెయిలు!

Publish Date:Sep 23, 2023

Advertisement

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22) ఆయన్ను సీఐడీ కస్టడీకి అప్పగించింది. గత నాలుగు రోజులుగా వాయిదాల పర్వంగా సాగిన ఈ తీర్పు శుక్రవారం రానే వచ్చింది. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరగా ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది.  

కాగా, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్ లభించింది. వివేకా హత్య కేసును ఏళ్లుగా సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ, సీఎం జగన్ కు సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో   నిందితులుగా సీబీఐ పేర్కొనగా.. ఎంపీ అవినాష్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉండగా.. ఇప్పుడు ఆయనకు కూడా బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డికి 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. భాస్కర్‌ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌ గూడ సూపరింటెండెంట్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఆయనకు వైద్య చికిత్స అందించాలని సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే, భాస్కర్ రెడ్డికి హైదరాబాద్‌ లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్‌ ను విడిచివెళ్లవద్దని సీబీఐ కోర్టు  షరతులు విధించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం (సెప్టెంబర్‌ 22)న విడుదలయ్యారు. 12 రోజుల బెయిల్ అనంతరం కూడా ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాకపోతే కనుక మరికొన్ని రోజులు బెయిల్ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అనారోగ్యం, చికిత్స పేరుతో ఇలా బెయిల్ పొడగించిన కేసులు ఇప్పటికే చాలా చూడగా.. ఇప్పుడు వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డి బెయిల్ కథ కూడా ఇలా కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

కాగా, ఒకవైపు కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని స్కాంలో చంద్రబాబును అక్రమంగా, కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయనను జైలుకు తరలించి.. మాజీ మంత్రి వివేకాను క్రూరాతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బెయిల్ పై బయటకి వదలడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక వైపేమో 43 వేల కోట్ల అవినీతి కేసులలో ఏ1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు దశాబ్ద కాలంగా బెయిల్ పై ఉంటూనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బెయిల్ పై ఉండే కోర్టుల అనుమతితో  దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. కనీసం నాలుగేళ్లుగా కోర్టు విచారణకు కూడా హాజరుకాకుండా సాకులు చెప్తున్నారు. ఇదే కేసులలో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ అవినీతి కేసు ఎప్పటికి తెలుస్తుందో కూడా తెలియడం లేదు. 

మరోవైపు వివేకా హత్యకేసులో నిందితులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఎంపీ అవినాష్ ఈసారి  ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మందీ మార్బలంతో స్థానికంగా చెలరేగిపోతూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాలతో జైలు నుండి బయటకి వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరో యువతీ, యువకుల భవితకు బంగారు బాట వేసిన చంద్రబాబును మాత్రం జైలుకు తరలించారు. కనీసం ఒక్క అవినీతి ఆధారం చూపించలేకపోతున్న సీఐడీ కస్టడీకి అప్పగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై నగరాలు, పట్టణాలు గ్రామాలలో రచ్చబండలు అన్న తేడా లేకుండా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా జనం స్వచ్చందంగా రోడ్ల పైకి వస్తున్నారు.  

By
en-us Political News

  
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు. యూనివర్శిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు. గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో.. అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో .. చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు భారీ షాక్ తగిలింది. గులాబీ బాస్‌తో పాటు పాటు మాజీమంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్ లో పేర్కొంది.
హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషాద ఘటన కలకలం రేపింది. అగ్నిప్రమాద కారణాలపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు.
జగన్ హయంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.