Publish Date:Dec 29, 2023
సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు వైసీపీలో వలసల పర్వానికి తెరలేపిందా? అంటే జరుగుతున్నపరిణామాలను బట్టి ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే పార్టీలో అసమ్మతి బహిర్గతమై.. అసంతృప్తి తారస్థాయికి చేరి.. తిరుగుబాటుకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో జగన్ అండ్ కో ఎమ్మెల్యేలను బుజ్జగించి సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి. కొందరైతే తాడేపల్లి ప్యాలస్ పిలుపు అందుకున్నా ఏవో కారణాలు చెప్పి ముఖం చాటేస్తున్నారు. మరి కొందరైతే వచ్చే ఎన్నికలలో తాము పోటీకి దూరంగా ఉంటామని తేల్చి చెప్పేస్తున్నారు. మరి కొందరు అయిష్టంగానే అధిష్ఠానం మాటను ఔదాల్చుతున్నారు.
ఏది ఏమైనా ఎన్నికల ముందు వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన నియోజకవర్గ మార్పుపై బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వెళ్లారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో ఆయన శుక్రవారం (డిసెంబర్ 29) రాత్రి భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన కోసం కాకినాడ చేరుకున్న సంగతి తెలసిందే. పవన్ కల్యాణ్ బస వద్దకు జ్యోతుల చంటిబాబు శుక్రవారం (డిసెంబర్ 28) రాత్రి పదిన్నర గంటల సమయంలో చేరుకున్నారు. ఆయనతో పాటు దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా వారిరువురి మధ్యా అధికార వైసీపీ సిట్టింగులను స్థానాలు మార్చడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చిట్టి బాబును కూడా నియోజకవర్గం నుంచి మార్చేయడానికి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు తన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్ఠానాన్ని ధిక్కరించారు. జగన్ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు.
ఇప్పటికే జ్యోతుల చంటిబాబు వర్గీయులు పలువురు వైకాపాకు రాజీనామా చేశారు జ్యోతుల చంటి బాబు సైతం జగన్ తీరును నిరసిస్తూ త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబు పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaggampet-ycp-mla-jyothula-chantibabu-meet-39-167905.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.