ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్లే అనిపిస్తుంది. రైతుబంధు మాదిరిగా రైతు భరోసా... కంటి వెలుగు... ఇలా కొన్ని పథకాల్లో సారూప్యత కనిపిస్తుంది. ఇక, ఆర్టీసీ విషయంలో కేసీఆర్ బాటలోనే జగన్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న జగన్ నిర్ణయమే తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు దారి తీసింది. చివరికి కార్మికులు ఏమీ సాధించలేక చేతులెత్తేస్తే ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఛార్జీల భారం మోపింది. అయితే, తెలంగాణ బాటలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోంది. నష్టాలను పూడ్చుకునేందుకు తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచడంతో ఏపీలోనూ ఫాలో కావాలని దాదాపు నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వస్తున్నాయి. డీజిల్ ధరలు పెనుభారంగా మారడంతో ఎప్పట్నుంచో ఛార్జీలు పెంచాలని ఏపీఎస్-ఆర్టీసీ కోరుతోంది. కానీ, నాలుగైదు ఏళ్లుగా ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రయాణికులపై భారం మోపకుండానే... ఇతర మార్గాల్లో ఆదాయం పెంచుకోవాలని చెబుతూ వచ్చింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏపీఎస్-ఆర్టీసీ కూడా ఆక్యుపెన్సీ రేషియోను క్రమంగా 82శాతానికి పెంచుకుంటూ వచ్చింది. అలాగే, సరుకు రవాణా ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికినీ నష్టాలు మాత్రం తప్పడం లేదు.
అయితే, అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ సర్కారు ప్రకటించడంతో కార్మికులకు భారీ ఊరట లభించినా... అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీసీతోపాటు ప్రైవేట్ బస్సుల ఛార్జీల నియంత్రణ కోసం ప్రత్యేక రెగ్యులేటరీ కమిషన్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూనే... మరోవైపు ప్రయాణికులపై భారం వేసేందుకు అడుగులు వేయడం సరికాదంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆర్టీసీ కార్మికుల జీతాల భారాన్ని ప్రభుత్వమే తీసుకుంటున్నప్పుడు... ఇక ఛార్జీలు పెంచాల్సిన అవసరమేంటని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaganmohan-reddy-follows-cm-kcr-39-91913.html
దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు.
న్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.
కేటీఆర్ హయాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్రగ్స్ దొరికేలాంటి కల్చల్ ఏర్పడిందని.. ఆయన హయాంలో పబ్ కల్చర్ పెరిగినంత మరెక్కడా పెరగలేదనీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీయే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు రేవంత్.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు.
గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది.
మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన తారక్ ప్రద్యుమ్న ఇంటి పేరు కొసరాజుగా ఉంది. అదే సునీతకు పుట్టిన పిల్లల ఇంటి పేరు మాగంటిగా ఉంది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు సైతం వారి దగగర పదిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీతకు చెందిన న్యాయవాదులు.
2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.
తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.
కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఈ తీరు పెరిగిపోతున్నది.
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.