తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ లక్ష్మణ్ కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జితేందర్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినప్పటికీ... బీజేపీ అధిష్టానం మాత్రం మళ్లీ లక్ష్మణ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల జితేందర్ రెడ్డి.... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవడంతో తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. అయితే, తెలంగాణ సామాజిక పరిస్థితులపై లెక్కలేసిన బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్మణ్ ను కొనసాగించడమే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చాయట. దాంతో, తెలంగాణ బీజేపీ పగ్గాలు మరోసారి లక్ష్మణ్ కే దక్కనున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మార్చబోతున్నారనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. అయితే, కన్నాను మార్చితే... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కి గానీ... ఎమ్మెల్సీ విష్ణువర్దన్ రెడ్డికి కానీ ఏపీ బీజేపీ పగ్గాలు ఇస్తారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-eyes-tdp-leaders-in-telangana-39-91911.html
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.