Publish Date:May 18, 2023
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అన్నారు గురజాడ. అయితే మన ఏపీ ముఖ్యమంత్రి మాత్రం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగినా పట్టించుకోవడం లేదు. సొంత ప్రయోజనాల కోసం అంటూ ప్రజలను నమ్మింది.. ప్రజాధనాన్ని ఇష్టా రాజ్యంగా ఖర్చు చేసేస్తున్నారు. తాజాగా రాష్ట్ర శ్రేయస్సు కోసం అంటూ ఏపీ సీఎం జగన్ చేపట్టిన రాజశ్యామల యాగం కోసం ప్రజాధనం పది కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ఈ యాగ నిర్వహణకు మహా అయితే పది లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది జగన్ సర్కార్ పది కోట్లు ఖర్చు చేసేసింది. తీరా చూస్తే ఆ యాగం లక్ష్యం ఉద్దేశం అంతా రాష్ట్ర శ్రేయస్సు కాదు. మరేమిటంటారా జగన్ కోసం. తన మీద ఉన్న కోర్టు కేసుల నుంచి బయటపడాలనీ, శత్రు భయం పోవాలనీ, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనీ..మాత్రమే. యాగ సంకల్పం కూడా అదే. తన మత విశ్వాసానికి యాగాలు చేయడం విరుద్ధం అయినా సొంత లాభం కోసం ప్రజా ధనాన్ని కర్చు పెట్టి మరీ యాగం చేశారు జగన్. ఆ యాగ సంకల్పం ఏమిటో మీరే వినండి..
మమ
సమస్త శతృూణ, ధూర్తహ ఫలాయన సిద్ధి ద్వారా
సర్వత్రా న్యాస్థానేషు
సర్వత్ర వ్యవహారేషు
సర్వత్రా సానుకూల్యత సిద్ధి ద్వారా
సమస్త మంగళ వాక్యర్థం, శ్రీ రాజశ్యామల
మాతంగేశ్వర దేవత అనుగ్రహ సిద్ద్యర్థం
శ్రీ చండీ పరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం
శ్రీ చండీ పరాంబిక పంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం
శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధం
మదీయ సర్వత్రా పురుషార్దేషు
యేయే ప్రతికూల కారణాహ ద్వేషాం ప్రాతికేల్యత కార
సానుకూలపర్యర్వేనా పరాయంత్ర, పరమంత్ర పరకీయ, సర్వదృష్ట గృహ సర్వా
మమ నిర్యుర్తిపూర్వక స్వకృత్య బలవృద్ధి అర్ధం
చండీ, రుద్రపూర్వక రాజశ్యామల మంత్ర దేవతా
సుదర్శన స్వరూపి సహిత శ్రీ మహా విష్ణు సహిత
శ్రీ మహా లక్ష్మి మహాయాగ అక్ష, కర్మణే, స్వర్ణ
మహాలక్ష్మీ దేవ్యాహ అనుగ్రహ ప్రసాదేనా అవాహనాది షోడచ ఉపచార పూజం కరిష్యే
ఇంత స్పష్టంగా తన కోసం తాను సంకల్పం చెప్పుకుని ప్రజాధనంతో యాగం నిర్వహించి రాష్ట్రం కోసమేనని జగన్ ఎంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారో..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-yagam-with-people-money-25-155538.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!