జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చంద్రబాబుని హత్య చేయిస్తాడని దస్తగిరి కుండ బద్దలు కొట్టాడు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దస్తగిరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన వెనుక చంద్రబాబు వున్నాడని జగన్, అతని అనుచరులందరూ ఆరోపణలు చేస్తూ వుంటారని, వాటిలో ఎంతమాత్రం నిజం లేదని దస్తగిరి చెప్పాడు. చంద్రబాబుతో తనకు ఏదైనా లావాదేవీ వుంటే, ఈ ఐదేళ్లలో మీ పార్టీనే అధికారంలో వుంది కదా? ఆధారాలతో సహా బయటపెట్టి వుండొచ్చు కదా అని జగన్ని దస్తగిరి ప్రశ్నించాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే చంద్రబాబుతోపాటు తనని, సునీతని, మరికొందరిని తప్పకుండా చంపిస్తాడని దస్తగిరి అన్నాడు. ఈ ఘోరాలు జరగకుండా వుండాలనే తాను మళ్ళీ జగన్ అధికారంలోకి రాకూడదని, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని దస్తగిరి అన్నాడు. ఈ ఐదేళ్ళుగా జరిగిన దారుణాలు ఆగిపోవాలంటే జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని దస్తగిరి అభిప్రాయపడ్డాడు. నేను హత్య చేశాను అని ధైర్యంగా చెబుతున్నానని, ఈ కేసులో లేనివాళ్ళని ఇరికించాల్సిన అవసరం తనకు లేదని దస్తగిరి వివరించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-will-kill-chandra-babu-39-175504.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? గెలిచే అభ్యర్థులు ఎవరు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరిలో నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా..? చంద్రబాబు సీఎం సీటును అదిరోహించబోతున్నారా? ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు..? అనే విషయాలపై ఏపీ ప్రజల్లోనేకాదు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు ఉండటం, వారాంతం కావడంతో ఒక్కసారిగా తిరుమల గిరులకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది.
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వివరాలు
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-2
ఏపీ అసెంబ్లీ.. ఇదిగో అన్ని సర్వేల సారాంశం!
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా జగన్ పార్టీకి షాక్ తగిలింది.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఏపీ లోక్సభ సర్వే మరింత విస్తారంగా...
లోక్సభ స్థానాల్లోనూ వైసీపీకి పెద్ద దెబ్బ