Publish Date:Aug 10, 2018
ప్రతిశుక్రవారం కోర్ట్ కు హాజరవుతున్న జగన్, ఇకనుండి సతీసమేతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. జగన్ అక్రమాస్తుల కేసులో మొదటిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి.. భారతీ సిమెంట్స్లో క్విడ్ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసింది.. అయితే భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది.. కానీ సీబీఐ ఆ పనిచేయలేదు.. సీబీఐ వదిలేసినా ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ చార్జిషీటు దాఖలు చేశారు.. ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్ట్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.. మొన్నటివరకు జగన్, మోదీతో కలిసిపోయారని ఆరోపణలు వినిపించాయి.. అసలు కేసులు మాఫీ చేసుకోవడానికే జగన్, మోదీతో చేతులు కలిపారని చాలామంది ఆరోపించారు.. కానీ ఇప్పుడేం జరిగింది? జగన్ కేసులు పోవడం ఏమో కానీ కొత్తగా భారతి పేరు కూడా చార్జిషీటులో చేరింది.. ఈడీ, సీబీఐ కేంద్రం చెప్పినట్టే నడుస్తున్నాయి.. మరి మోదీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా?.. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది.. మోదీ, జగన్ ని పూర్తిగా నమ్మట్లేదు అందుకే కేసుల్ని అడ్డం పెట్టుకొని జగన్ ని గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తున్నారని కొందరు అంటుంటే.. జగన్ ని కావాలనే బలహీనపరిచి వచ్చే ఎన్నికల్లో పవన్ తో దోస్తీ చేయాలని చూస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు.. ఇవన్నీ గ్రహించిన జగన్, బీజేపీకి అందుకే ఇప్పుడు కాస్త దూరంగా ఉంటున్నారని.. ఒకప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో అడగకుండానే బీజేపీ మద్దతిచ్చిన జగన్, ఈమధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండటానికి కారణం ఇదే అయ్యుండొచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.. అసలు బీజేపీ, జగన్ మనసుల్లో ఏముందో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఇలాంటి ఆరోపణలు, అభిప్రాయాలూ మాత్రం వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై స్పందించిన జగన్.. 'నా భార్య పేరు చార్జిషీటులో ఉందని ఓ సెలెక్టెడ్ మీడియాలో వచ్చిన వార్త విని షాకయ్యాను.. ఇది చాలా బాధాకరం.. కుటుంబాలను ఇలాంటి విషయాల్లోకి లాగడం సబబు కాదు.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను చూసినప్పుడు బాధేస్తుంది' అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-wife-named-accused-in-ed-case-39-83085.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.