గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా అప్పులు చేయడానికీ, అప్పుల పరిమితితో సంబంధం లేకుండా రుణాలు పొందడానికి జగన్ కు అన్ని విధాలుగా సహకారం అందించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ముఖం చాటేస్తోందా? అసలు ఏపీ సీఎం కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకే మోడీ సుముఖంగా లేరా అంటే గత పక్షం రోజులుగా పరిస్థితిని గమనిస్తున్న పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో పది పదిహేను రోజుల లోపే వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రకటన వెలువడేలోగానే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించాలని భావిస్తున్నారు.
అయితే తన ఐదేళ్ల పాలనను చూసిన జనం కేవలం ప్రకటనలను నమ్మరన్న భావన కూడా ఆయనలో బలంగా ఉంది. అందుకే కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఏదో మేరకు ఆ పథకాల లబ్ధిదారులను సొమ్ములను పందేరం చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని నడపడానికే కటకటలాడుతున్న పరిస్థితుల్లో కొత్త పథకాల పందేరానికి తీవ్రమైన నిధుల కొరత ఉండటంతో రుణం కోసం డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసినా, కోట్లకు కోట్ల ప్రతి నెలా అప్పులు తీసుకువచ్చినా ఏ నెలకానెల గడవడమే గగనంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి ఎవరూ అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. చివరాఖరికి సెక్రటేరియెట్ ను కూడా తాకట్టు పెట్టేసిన జగన్ నిర్వాకాన్ని చూసి ఆర్థిక నిపుణులు సైతం ముక్కున వేలేసుకుని, నోటమాట రాక నివ్వెరపోతున్న పరిస్థితి.
సర్వ నిబంధనలకూ తిలోదకాలోదిలేసి జగన్ ఈ ఐదేళ్లుగా సాగించిన ఆర్థిక ఆరాచక విధానాలకు ఇప్పుడు ఎన్నికల ముంగిట కేంద్రం చెక్ పెట్టడానికి రెడీ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత పక్షం రోజులుగా జగన్ అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా మోడీ అప్పాయింట్ మెంట్ దక్కడం లేదని అంటున్నారు. నిజమే మోడీ అప్పాయింట్ మెంట్ ఎప్పుడు లభిస్తే అప్పుడు రెక్కలు కట్టుకుని మరీ హస్తనలో వాలిపోవడానికి జగన్ డిస్పరేట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే మోడీ అప్పాయింట్ మెంట్ విషయంలో నో అన్న సమాధానం రాకపోయినా, ఆ అప్పాయింట్ మెంట్ మాత్రం ఫిక్స్ కావడం లేదని హస్తిన వర్గాలు చెబుతున్నాయి.
ఇక పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మోడీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 13 వరకూ ఆయన పర్యటనల్లో బిజీగా ఉంటారు. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల లోగా జగన్ కు మోడీ అప్పాయింట్ మెంట్ దొరికే అవకాశాలు మృగ్యమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ లోగా తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ జట్టుకట్టే విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక జగన్ మోడీ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం కూడా దండుగేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలతో సంక్షేమం పేరిట ఎన్నికలకు ముందు పందేరం చేయాలన్న జగన్ ఆశలు అడియాశలు కాకతప్పవని పరిశీలకులు అంటున్నారు. మోడీ అప్పాయింట్ మెంట్ పై ఆశతో తన చివరి కేబినెట్ భేటీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న జగన్ ఇక ఆ భేటీ నిర్వహిస్తారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-waiting-for-modi-appointment-39-171620.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.