Publish Date:Oct 14, 2022
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనకు రాజకీయాలపై ఎంత మాత్రం ఆసక్తి లేదని పదే పదే చెబుతున్నా, వైసీపీ మాత్రం ఆయనను వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడలో లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అక్కినేని నాగార్జున అయితేనే బాగుంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే అక్కినేని నాగార్జున తాను ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని పదే పదే చెబుతున్నా... జగన్ మాత్రం ఆయనపై ఒత్తిడి తెస్తున్నారనీ, ఇప్పటి వరకూ బెజవాడ పార్లమెంటు స్థానంలో గెలవలేకపోయిన వైసీపీ ఈ సారి ఆ స్థానంలో గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆ స్థానంలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్.. అక్కడ నుంచి అక్కినేని నాగార్జునను నిలబెడితేనే విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని నాగార్జున వైసీపీ అభ్యర్థి అయితే సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా వైసీపీకి అధిక ప్రయోజనం ఉంటుందనీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లను కూడా ఆయన చీల్చగలుగుతారనీ, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో చీలిక బారీగా ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారని చెబుతున్నారు.
అందుకే నాగార్జున అంగీకారం, తిరస్కారంతో సంబంధం లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయనే విజయవాడ లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం వెనుక వైసీపీయే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాలు, తన రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని జగన్ నాగార్జునపై విజయవాడ నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రాజకీయ వర్గాలలో బాగా ప్రచారంలో ఉంది. విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ విజయం సాధించాలంటే... ఆ స్థానం నుంచి నాగార్జునను నిలబెట్టడం వినా మరో మార్గం లేదని జగన్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం.
అన్నిటికీ మించి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి నాగార్జునను బరిలోకి దింపితే... దాని ప్రభావం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా పడి... ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలోని వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడతాయని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే నాగార్జున బహిరంగంగానే తానే పార్టీ తరఫునా ఎన్నికలలో పోటీ చేయబోయేది లేదని పదే పదే విస్పష్టంగా చెబుతున్నా... పట్టించుకోకుండా వైసీపీ తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. అక్కినేని నాగార్జునే విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి అన్న ప్రచారాన్ని కొనసాగిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-very-keen-on-bezawada-putting-pressure-on-nagarjuna-to-contest-there-25-145388.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.