జగన్ వర్సెస్ విజయసాయి.. ఇక మాటల యుద్ధమేనా?

Publish Date:Feb 7, 2025

Advertisement

 

అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలలో క్యారెక్టర్ అంటూ ఇటీవలే పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయసాయి నుంచీ ఘటు స్పందన వచ్చింది. రాజకీయాలలో ఎవరికైనా క్యారక్టర్ అనేది చాలా అవసరమని విజయసాయి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  దీంతో తన క్యారెక్టర్ పై మాట్టాడిన జగన్ కు క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పేశారు. వీరిద్దరి మధ్యా సంవాదంపై నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. ఇంతకీ ఇద్దరిలో క్యారెక్టర్ లేనిది ఎవరికి? విజయసాయికా? జగన్ కా లేక ఇద్దరికీనా? అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. 

విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే పార్టీకి రాజీనామా చేయలేదు. తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని మాత్రపే పేర్కొన్నారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతోనే పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా లేఖను జగన్ కు పంపారు. అప్పుడే విజయసాయి, జగన్ ల మధ్య అగాధం ఏర్పడిందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అదీ కాక చాలా కాలంలో వైసీపీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుండటం కూడా విజయసాయి రాజీనామా నిర్ణయానికి కారణమై ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషించారు. 

వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన విజయసాయి జగన్ కు, ఆయన పార్టీకీ దూరం కావడంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదీ కాక జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2. దీంతో ఇప్పుడు విజయసాయి జగన్ కు దూరం అవ్వడమే కాకుండా ఆయన క్యారెక్టర్ పై కూడా వ్యాఖ్యలు చేయడం పెను సంచలనంగా మారింది. తన రాజీనామా సమయంలో కూడా జగన్ పట్ల చాలా సానుకూలంగా విజయసాయి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కూడా విజయసాయి చెప్పారు. తానిక రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నాననీ, వ్యవసాయమే ఇక తన వ్యాపకమనీ ప్రకటించినా.. విజయసాయి మాటల్లో, చేతల్లో రాజకీయాలు కనిపిస్తూనే ఉన్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తరువాత హైదరాబద్ లోడస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో విజయసాయి భేటీ కావడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డిల మధ్య మాటలయుద్ధం అన్న స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అంతకు మించి సంచలనం సృష్టిస్తున్నాయి. 

విజయసాయి రాజీనామా చేసినా వైసీపీ నుంచి జగన్ సహా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. అదోక విషయం కాదన్నట్లుగానే వ్యవహరించారు. స్పందించక పోవడం ద్వారా విజయసాయిరెడ్డి తమకు పెద్ద ఇంపార్టెంట్ కాదన్న సంకేతం ఇచ్చారు. అయితే గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ జగన్ విజయసాయి రాజీనామాపై స్పందించారు. రాజకీయాలలో క్యారెక్టర్ ముఖ్యం అంటూ వ్యాఖ్యానించి అలా క్యారెక్టర్ లేకుండా పార్టీని వదిలేసిన విజయసాయిరెడ్డి అయినా మరొకరైనా ఒకటే నంటూ వ్యాఖ్యనించారు. దీనిపై విజయసాయి వెంటనే రియాక్ట్ అయ్యారు. నిజమే రాజకీయాలలో క్యారెక్టర్ అనేది ఎవరికైనా ముఖ్యమేనని ట్వీట్ చేశారు. తాను రాజకీయాలలోనే కాదు వ్యక్తిగతంగా కూడా క్యారెక్టర్ ఉన్నవాడినేనని చెప్పుకున్నారు. అందుకే పార్టీకే కాదు, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని పేర్కొన్నారు. 

రెండు వారాల కిందల వైసీపీకి, రాజ్యసభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో జగన్ పై తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఫ్యామిలీతో తనకున్న అనుభందాన్ని చెప్పుకొచ్చారు. తాను తన రాజీనామా విషయం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ కు చెప్పాననీ, ఆయన అనుమతితోనే వైదొలగుతున్నాననీ కూడా ఆ మీడియా సమావేశంలో చెప్పారు. అంతే ఆ తరువాత ఆయన ఇక రాజకీయాల గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. అయితే జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన కొన్ని రోజుల తరువాత విజయసాయి క్యారెక్టర్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆ స్పందన జగన్ తో ఢీ అంటే ఢీ అనడానికి విజయసాయిరెడ్డి రెడీ అయిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోంది. 

వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడ్ని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు, భయం అనేది నాలో అసలులేదు కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాలలో  పెను సంచలనంగా మారింది. దీనికి జగన్ ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఇరువురి మధ్యా ఈ పరిణామం మాటలయుద్ధానికి దారి తీసే పరిస్థితులున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం వైసీపీ మీదే కాదు, జగన్ ఆస్తుల కేసులపైనా పడుతుందంటున్నారు.  

By
en-us Political News

  
ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది.
హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట.
వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు.
ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా రణ రంగంలోకి దిగనుందనే సంకేతాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్‌లోకి ఎంటరైతే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది.
ఆస్తిని పిల్లలకు పించి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది.
తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో జమకాలేదని అన్నందుకు లబ్ధిదారులపై దాడికి పాల్పడిన డిజిటల్ కలెక్టర్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా వడిగల వారి పల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బాబా ఫక్రుద్దీన్ తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో పడలేదేంటని ప్రశ్నించిన గండువారిపల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర్ వారి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.