జగన్ ఉత్తరాంధ్ర ఆశలు ఆవిరి!

Publish Date:Dec 30, 2023

Advertisement

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం సమయం నుండే రాయలసీమ తర్వాత తనను కాపాడేది ఉత్తరాంధ్ర మాత్రమే అని భావిస్తూ.. భ్రమిస్తూ వచ్చారు. కోస్తా ఆంధ్రాలో తనకు ఎలాగు గ్రిప్ దక్కదని భావనతో జగన్.. రాయలసీమ, ఉత్తరాంధ్రలను తనకు కంచుకోటగా మలచుకోవాలని భావించారు. అందుకోసమే జగన్  తల్లి విజయమ్మను విశాఖ నుండి పోటీకి దింపగా.. అక్కడి ప్రజలు ఘోరంగా ఓడించి వెనక్కు పంపించారు. దాదాపు రెండు లక్షలకు పైగా మెజార్టీ ఓటమి వైసీపీకి అక్కడ ఛాన్స్ లేదని అప్పుడే తేటతెల్లం చేసింది. కానీ  వైసీపీ ఆశలు మాత్రం చావలేదు. ఏకంగా  రాజధానిని ఉత్తరాంధ్రకు తెస్తానని ఇన్నాళ్లు ప్రకటనతో  అక్కడి ప్రజలలో ఆశలు కల్పించారు. ముందుగా మూడు రాజధానులంటూ చెప్పినా.. చివరికి విశాఖే  రాజధాని అంటూ ప్రకటిస్తూ మురిపెం పెంచారు. కానీ, తీరా ఎన్నికలకు సమయం ఆసన్నమైనా ఇప్పటికీ విశాఖ రాజధాని ఊసేలేదు. కనీసం వైసీపీ నేతలు చెప్పిన విశాఖ నుండి పరిపాలన కూడా అమల్లోకి రాలేదు.

అసలే ప్రజలలో అసంతృప్తి.. పైగా రాజధాని మోసం.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు కలిసి ఉత్తరాంధ్ర నేతలు వైసీపీకి బైబై చెప్పేస్తున్నారు. జగన్ ఎలాగైనా విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పట్టు కోసం పోరాడుతుంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పలువురు నాయకులు మాత్రం పార్టీకి దూరమవుతున్నారు. వైసీపీ హై కమాండ్ కు ఇది మింగుడు పడడం లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకకాలంలో నాయకులంతా పార్టీని వీడుతుండడం ఇప్పుడు జగన్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీని వీడగా..ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతంపార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు సీతంరాజు సుధాకర్ కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సుధాకర్.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన వారిలో ఒకరు. కానీ, పార్టీ నిర్ణయాలతో విభేదించి రాజీనామా చేసేశారు.  

పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కోసం పనిచేస్తున్న సుధాకర్.. తొలినుండి విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కొంతకాలం కిందట విశాఖ పట్టభద్రుల స్థానం నుంచి సుధాకర్ ను పోటీ చేయించి.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విభేదాలకు చెక్ చెప్పాలని జగన్ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో సుధాకర్ ఓడిపోవడంతో ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూపంలో పోటీ ఎదురయ్యింది. మరోవైపు కోలా గురువులు సైతం ఆశావహుడిగా బయటకొచ్చారు. దీంతో సుధాకర్ కు టికెట్ లేదని హై కమాండ్ తేల్చింది. దీంతో ఆయన పార్టీకి బైబై చెప్పేశారు. అయితే విశాఖలో జరుగుతున్న వరుస పరిణామాలు   వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.

ఒక్క సుధాకర్ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర నుండి డజనుకుపైగా వికెట్లు పడే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పలుచోట్ల సీనియర్లకు టికెట్లు లేవని అధిష్టానం తేల్చడంతో వీరంతా ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంచార్జిల మార్పుపై పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి సహకరించే పరిస్థితి లేదని బహిరంగంగానే తేల్చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా జగన్ విశాఖ ఆశలు ఆవిరైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలున్నా ఉత్తరాంధ్రను వైసీపీకి అనుకూలంగా మలచడంలో ఫెయిలైనట్లు విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర నేతలు ఇబ్బందులు పడగా.. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో గందరగోళం, ఇప్పటికే ఖరారైన పార్టీ ఓటమి ఇక్కడ నేతలను పార్టీకి దూరం చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.