సిట్టింగుల మార్పు పంచాయతీలన్నీ తాడేపల్లి ప్యాలస్ కే.. వైసీపీలో పతాక స్థాయికి సంక్షోభం!

Publish Date:Dec 30, 2023

Advertisement

అధికార వైసీపీలో సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో  ఎన్నికల హీట్  పెరగడంతోనే వైసీపీలో ఆందోళన స్టార్ట్ అయ్యింది.  ఓటమి భయంతో వైసీసీ అధినేత  పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల  నియోజకవర్గాల   మార్పు చేపట్టారు.  అయితే జగన్ నిర్ణయం    పార్టీలో కాక రేపుతోంది. సీనియర్లు జూనియర్లు అని లేకుండా జగన్ మొండి నిర్ణయాలతో పార్టీలో ఇప్పుడు సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇప్పటికే 11 మందిని మార్చేశారు.  ఇప్పుడు రెండో విడత మార్పులకు  సంప్రదింపులు, కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో స్థానాల మార్పుకు ససేమీరా అంటున్న కొందరు ఎమ్మెల్యేలు, అసలు ఈసారి సీట్లు దక్కని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం గట్టిగానే  వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా జగన్ రెండో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. శనివారం (డిసెంబర్ 30) ఈ రెండో  విడత మార్పులును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి శుక్రవారమే (డిసెంబర్ 29) ఇందుకు సంబంధిత అధికారిక ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు.  తాడేపల్లి జగన్ ప్యాలెస్ లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి కూడా కనిపించింది. కానీ  కారణాలేంటో తెలియదు కానీ  సదరు ప్రకటన విడుదల కాలేదు.  రెండో జాబితాలో మార్పులూ చేర్పులూ ఇవేనంటూ ఓ జాబితా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.

వైసీపీ అభ్యర్థుల మార్పు జాబితాలో 35మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.  వైసీపీ   వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు ఖరారు అయిన ఎమ్మెల్యేల పేర్లు ఇలా ఉన్నాయి. విశాఖ నార్త్ నుండి కేకే రాజు, మాడుగుల నుండి బూడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్, నర్సీపట్నం నుండి పెట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, జగ్గంపేట తోట నరసింహం, పెద్దాపురం దావులూరి దొరబాబు, పత్తిపాడు వరుపులు సుబ్బారావు. పిఠాపురం వంగా గీత, ముమ్మిడివరం పొన్నాడ సతీష్, భీమవరం గ్రంధి శ్రీనివాస్, మంగళగిరి గంజి చిరంజీవి, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు,  కైకలూరు దూలం నాగేశ్వరరావు, తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మచిలీపట్నం పేర్ని కిట్టు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వర రావు(నాని), తెనాలి అన్న బత్తుని శివకుమార్, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, కందుకూరు మహీధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రం రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నారాయణస్వామి లేదా కోనేటి ఆదిమూలం, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం కె. ఆర్. జె భరత్, జమ్మలమడుగు వైయస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, పులివెందుల వైయస్ జగన్మోహన్ రెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుగొండ కె.వి ఉషశ్రీ చరణ్, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. 

కాగా నియోజకవర్గ మార్పునకు ఇష్టపడని ఎమ్మెల్యేలు, సీట్లు దక్కని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా.. వీరిని బుజ్జగించే పనిని రీజినల్ కోఆర్డినేటర్లకు అధిష్టానం అప్పగించింది. అయితే, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ బుజ్జగింపులు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో అన్ని పంచాయతీలు తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతున్నాయి. వీటిని పరిష్కరించలేక   జగన్ తల పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జగన్ మాటలకు కూడా మెత్తబడని ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు.  గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే  వెళ్లిపోయేవారు తమ వారు కాదని, గెలవని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించలేమని అంటూ జగన్ అసంతృప్తులను మరింత రెచ్చగొడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కొత్త ఇంచార్జిల ఓటమి కోసమే పనిచేస్తామని అసంతృప్త ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారు. దీంతో వైసీపీలో సంక్షోభం ముదిరి పాకాన పడినట్లైంది. ఇది ఎన్నికల సమయానికి మరింత తీవ్రమై పార్టీ పుట్టి ముంచే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.