బాబు మెతక.. జగన్ ముతక!

Publish Date:Jul 22, 2024

Advertisement

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికీ మెతకగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకు ఇంకా వారిని ఉపేక్షిస్తున్నారంటూ ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తి, అసహనం కరక్టే అనేలా వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ తీరు ఉంది. ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి 45 రోజులు అయ్యింది.

ఇప్పటికీ చంద్రబాబు జగన్ హయాంలో హద్దులు మీరిన అధికారుల పట్ల, ఇష్టారీతిగా చెలరేగి వ్యవహరించిన వైసీపీ నేతలు, క్యాడర్ పట్ల క ఠినంగా వ్యవహరించడం లేదన్న భావన మెజారిటీ తెలుగుదేశం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఓటమి తరువాత కూడా వైసీపీ నేతలూ మరీ ముఖ్యంగా జగన్ వ్యవహరిస్తున్న తీరు ఉంటోంది. అసెంబ్లీ వద్ద జగన్ సోమవారం (జులై 24) వ్యవహరించిన తీరును చూస్తే తెలుగుదేశం క్యాడర్ లో అసహనానికి అర్ధం ఉందని అనిపించక మానదు. 

కేవలం 11 మంది సభ్యుల బలంలో అసెంబ్లీలో విపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పట్ల చంద్రబాబు సర్కార్ ఉదారంగా వ్యవహరించింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రస్తుత అసెంబ్లీలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు విపక్ష నేత హోదా లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి ఆయన అందరు ఎమ్మెల్యేల్లాగే నాలుగో నంబర్ గేటు వద్ద కారు దిగి నడిచి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. కానీ వైసీపీ సభ్యుల వినతి పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు జగన్ కు ఓ మినహాయింపు ఇచ్చారు. ఆయన తన వాహనంలోనే అసెంబ్లీలో కి నాలుగో నంబర్ గేట్ గుండా  ప్రవేశించే వెసులుబాటు కల్పించారు. 

అయితే జగన్ వ్యవహరించిన తీరు ఆయనా గౌరవానికి అర్హుడుకాడని మరో సారి రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం గుండానే లోపలకు ప్రవేశిస్తానంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. అయితే ఆయనను వేరే గేటుగుండా రావాల్సిందిగా పోలీసులు సూచించారు. ప్రధాన గేటు గుండా గవర్నర్ వచ్చే సమయం ఆసన్నమైనందున ఆ గేటుగుండా వైసీపీ నేతను అనుమతించే ప్రశక్తే లేదని విస్ఫష్టంగా చెప్పారు. దీంతో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగారు. సేవ్ డెమొక్రసీ, పోలీస్ డౌన్ డౌన్ అంటూ  అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలనూ పోలీసులు ప్రధాన గేటు గుండా అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు వేరు గేటుగుండా అసెంబ్లీలోకి వెళ్లారు.  ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ అనవసరపు రాద్ధాంతం చేసి తనలో ఇసుమంతైనా మార్పు రాలేదని చాటుకున్నారు. గౌరవం ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా ఆయనకు తెలియని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైసీపీ నినాదాలతో హోరెత్తించడానికి ప్రయత్నించి విఫలమై సభ నుంచి వాకౌట్ చేసింది.  ఇదిగో జగన్ ఇలాంటి వైఖరిని ఎత్తి చూపుతూనే చంద్రబాబు తన మెతక తనాన్ని వీడి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
సురేష్ బాబు చేసిన అక్ర‌మాలపై టీడీపీ కార్పొరేట‌ర్లు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగింది. కార్పొరేష‌న్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నుల‌ను బినామీల రూపంలో త‌న కుటుంబానికి చెందిన కాంట్రాక్టు సంస్థ‌ల‌కు సురేష్ బాబు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన మాట వాస్తవమేనని తేలింది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.