జగన్ రోజు రోజుకూ ఓ ట్రోల్ ఐటెమ్ గా మారిపోతున్నారా?

Publish Date:Jul 2, 2026

Advertisement

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్.. రోజు రోజుకూ ఓ ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన   మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే.. ట్రోలింగ్ కు, మీమ్స్ కు కావలసినంత స్టఫ్ దొరుకుతుందని నెటిజనులు సంబరపడిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రెస్ మీట్ లలో చేసే ప్రసంగాలు ఉంటున్నాయి.  జగన్ ప్రసంగాలు,  మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.

 నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.  అందుకు తగ్గట్టుగానే జగన్   వివాదాస్పదమైన, వినూత్నమైన ప్రకటనలు ట్రోలర్లకు, నెటిజనులకు కావలసినంత స్టఫ్ అందిస్తున్నాయి.  తాజాగా బుధవారం (జూన్ 1) జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో  అమరావతి వర్సెస్ 'మావిగన్' అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికే జగన్ మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా అందరి హేళనలకూ గురై ఒక హాస్యాస్పద అంశంగా మారిపోయింది. అదలా ఉండగానే.. తన తాజా ప్రెస్ మీట్ లో జగన్  ఏకంగా మావిగన్ ను వచ్చే ఎన్నికల అజెండాగా ప్రకటించడం నెటిజనులకు పండుగలా మారింది. 

ఇక దీనిపై మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం దాటవేసిన తీరు కూడా ఆయనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు కారణమైంది. సాధారణంగా ప్రెస్ మీట్లలో ఎదురయ్యే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే జగన్, ఈసారి మాత్రం ఎన్నికల అజెండాగా మావిగన్ అంటూ చేసిన ఆయన ప్రకటనపై విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం కూడా జగన్ పారిపోయారు అంటూ నెటిజనులు ట్రోల్ చేయడానికి కారణమైంది.  మావిగన్ ఎన్నికల అజెండా అయితే విశాఖ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు జగన్ నిరుత్తరుడై, కనీసం ఆ ప్రశ్న సంధించిన విలేకరి వైపైనా చూడకుండా.. హడావుడిగా ప్రెస్ మీట్ ను ముగించేయడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ జారుకున్నారనీ, ప్రశ్నలు వినిపించలేదన్నట్లు యాక్ట్ చేయడంలో జగన్  కమల్ హసన్ ను మించిపోయారనీ నెటిజన్లు వీర లెవెల్లో ఎగతాళి చేస్తున్నారు.  2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్.. ఆ ఐదేళ్లూ  విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అని, త్వరలోనే అక్కడి నుంచే పాలన సాగిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి అత్యంత ఆదర్శవంతమైన ఫార్ములా మూడు రాజధానులేననీ, అదే తాను చేస్తున్నాననీ చెప్పుకున్నారు.

అయితే మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలూ  2024 ఎన్నికలలో మూకుమ్మడిగా తిరస్కరించి, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జగన్ తాజాగా విశాఖను, మూడు రాజధానులనూ వదిలేసి మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తన తాజా ప్రెస్ మీట్ లో వైజాగ్ రాజధాని గురించి అడిగిన ప్రశ్న వినగానే..  ఏం చేస్తున్నాడో తెలియనట్లు రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడిచి వెళ్లిపోయారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.