రోశ‌య్యకు జగన్ నివాళులు.. తెర‌వెనుక పెద్ద క‌థే ఉంది!?

Publish Date:Dec 4, 2024

Advertisement

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొండితనానికీ, తనమాటే నెగ్గాలన్న మంకుపట్టుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారు.. కాదుకాదు.. కుందేలుకు నాలుగు కాళ్లు అని ఆయ‌న‌కు వివ‌రంగా చెప్పేందుకు ఎవ‌రు ప్ర‌య‌త్నించినా  వారి అంతుచూసే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌రు. దీంతో జ‌గ‌న్   గురించి తెలిసిన వైసీపీ నేత‌లు ఏ విష‌యంలోనూ ఆయ‌న‌కు స‌ల‌హా ఇచ్చేందుకు, త‌ప్పుచేస్తున్నారని చెప్పేందుకు సాహ‌సం చేయ‌రు. అధికారంలోకి రాక‌ ముందు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న అలానే ఉంటూ వ‌చ్చింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విచిత్ర నిర్ణ‌యాల‌తో వైసీపీ నేత‌ల‌కు చాలా సార్లు త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టారు. అధికారంలో ఉన్నాం క‌దా అని చాలా మంది వైసీపీ నేత‌లు స‌ర్దుకుపోతూ వ‌చ్చారు. జ‌గ‌న్ తన మొండితనంతో తీసుకున్న నిర్ణ‌యాల‌తో చివ‌రికి వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. ముఖ్య‌మంత్రి హోదాలో ప‌ర‌దాలు క‌ట్టుకొని స‌భ‌ల‌కు వెళ్ల‌డం, రైతుల పాస్ పుస్త‌కాల‌పై తన బొమ్మలు ముద్రించుకోవడం, స‌చివాల‌యాన్నికూడా తాక‌ట్టు పెట్టి అప్పులు తేవ‌డం, ఓ కులంపై క‌క్ష‌ పూరితంగా వ్య‌వ‌హ‌రించడం, అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఇలా త‌న అసంబద్ధ నిర్ణయాలతో పార్టీ ఓటమికి, ఆయననే నమ్ముకున్న నేతల పరాజయానికీ జగన్ కార‌ణ‌మ‌య్యారు.

అయితే ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిన తరువాత  కూడా జగన్ తన అసంబద్ధ నిర్ణయాలతో    పార్టీని మరింత పతనం దిశగా నడిపిస్తున్నారు. ఈ మాట పలు సందర్భాలలో వైసీపీయులే బాహాటంగా చెప్పారు. అయితే ఇప్పుడు అంటే పూర్తిగా చేతులు కాలిపోయిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ లో కొంత మార్పు వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలో సెలెక్టివ్ గా కొందరి మాటలకు ఇప్పుడు జగన్ ఎంతో కొంత విలువ ఇస్తున్నారని అంటున్నారు. వారి సలహా మేరకు అప్పుడప్పుడు నడుచుకుంటున్నారని ఉదాహరణలు చూపుతున్నారు.     మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తూ జ‌గ‌న్ ట్వీట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ జగన్ లో మార్పునకు ఇదే తార్కానం అని అంటున్నారు. జ‌గ‌న్ స్వ‌భావం ప్ర‌కారం ఆయన ఇలా రోశయ్యకు నివాళులర్పించడం మామూలు పరిస్థితుల్లో అయితే జరగదు. తనకు ఇస్టం లేని నేతల మరణం సందర్భంగా ఆయన ఇలా నివాళులర్పించిన సందర్భాలు గతంలో లేవు.   

జగన్ ఏ మాత్రం దాపరికం లేకుండా అయిష్టతను బాహాటంగా ప్రదర్శించే నేతలలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఒకరు.  జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి రోశ‌య్య సన్నిహితులు. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అనేక సంద‌ర్భాల్లో రోశ‌య్య చెప్పిన సూచ‌న‌లు వైఎస్ తు.చ. త‌ప్ప‌కుండా పాటించేవారు. ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే జగన్ మాత్రం రోశయ్యకు దూరంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం తనను కాదని రోశయ్యను సీఎం చేయడంతో జగన్ రోశయ్యపై కోపం, అయిష్టతా పెంచుకున్నారని వైసీపీ వర్గీయులే చెబుతుంటారు. అందులో భాగంగానే  రోశయ్య మరణించిన సమయంలో జగన్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కూడా వెళ్లలేదు.    ఆ త‌రువాత కాలంలో రోశ‌య్య జ‌యంతి, వ‌ర్ధంతిల‌కు  నివాళుల‌ర్పించిన దాఖ‌లాలు లేవు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి చెందిన వారినికూడా జ‌గ‌న్‌ పెద్ద‌గా ద‌గ్గ‌ర‌కు రాణిచ్చేవారు కాద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అధికారం కోల్పోయిన త‌రువాత ఇప్పుడు జ‌గ‌న్ కు రోశ‌య్య గుర్తుకు రావ‌డం, ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్ చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.  

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రోశ‌య్య‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేత‌లు రోశ‌య్య విగ్రహం పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలకూ జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో రోశ‌య్య‌పై జ‌గ‌న్‌కు ఉన్న కోపాన్ని కొంద‌రు వైసీపీ నేత‌లు ప్ర‌త్య‌క్ష్యంగా చూశార‌ని చెబుతారు. దీనికి కారణం వైఎస్ చనిపోయిన తర్వాత హైకమాండ్ రోశయ్యను సీఎంగా చేయడమే. తనను కాదని రోశయ్య సీఎం పదవి తీసుకున్నారన్న కోపం ఉంది. రోశ‌య్య సీఎం అయిన త‌రువాత ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేందుకు జ‌గ‌న్ అనేక ప్ర‌య‌త్నాలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ఆయ‌న కోవ‌ర్టుల ద్వారా రోశ‌య్య‌ను అనేక ర‌కాలుగా జ‌గ‌న్ ఇబ్బందుల‌కు గురిచేశార‌ని అప్ప‌ట్లో కొంద‌రు కాంగ్రెస్‌ నేత‌లు మీడియా ముఖ్యంగానూ ప్ర‌స్తావించారు. జగన్ పెట్టిన ఇబ్బందుల కారణంగానే రోశ‌య్య సీఎం పదవి వదిలేసుకున్నార‌ని అప్పట్లో రాజకీయవర్గాలలో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరికి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌ హైక‌మాండ్ సీఎంగా చేసింది. అయితే, రోశ‌య్య మ‌ర‌ణించిన స‌మ‌యంలోనూ ఆయ‌న పార్దివ దేహానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించేందుకు వెళ్ల‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ, అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ రోశ‌య్య మాట ఎత్తితే జ‌గ‌న్‌ కోప‌గించుకునేవాడ‌ట‌. 

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత జ‌గ‌న్ రెడ్డి తొలిసారి రోశయ్యను గుర్తుచేసుకోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల‌నూ, వైసీపీ శ్రేణుల‌నూ కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.   మా కుటుంబానికి ఆప్తుడు అయిన రోశయ్యకు వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని జ‌గ‌న్  ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన రోశయ్యకు నివాళులర్పించడంపై నెటిజనులు మండిపడుతున్నారు.  సీఎం పదవిలో ఉన్నప్పుడు రోశయ్యకు ఒక్కసారికూడా ఎందుకు నివాళులు అర్పించలేదని  నిలదీస్తున్నారు.  అది పక్కన పెడితే ఇప్పుడు హఠాత్తుగా జగన్ కు రోశయ్యపై అభిమానం, ప్రేమ పొంగుకు రావడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి దగ్గర కావడానికీ, వారి సానుభూతి పొందడానికే జగన్ ఇప్పుడు రోశయ్యను గుర్తు చేసుకుంటున్నారనీ, ఆయన తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడని చెప్పుకుంటున్నారనీ అంటున్నారు.   

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.