Publish Date:Jul 27, 2022
పరుగులు తీయాలి.. గిత్తలు ఉరకలు వేయాలి.. అంటూ ఎన్టీఆర్, భానుమతి ఎడ్లబండిమీద వెళుతోంటే సినీ ప్రేక్షకులు హాల్లో లేచి వారి వెంట పరిగెట్టినంత హడావుడి చేసేరు. ఈమధ్యనే పి.గన్నవరంలో ఆంధ్రా సీఎం జగన్ రెడ్డి కూడా ఎడ్లబండి కాదుకానీ ట్రాక్టరెక్కి ఉరకలు లేకుండా బహు నెమ్మదిగా వెళ్లి నా ఎవ్వరూ వెంట రాలేదు! పైగా అక్కడున్న పది గేదెలు ఈయనెందుకు ఇటోచ్చాడన్న అనుమానంతో చూశాయి.
ఇటీవల గోదవారి వరదలు, భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ఉభయగోదావరి జిల్లాల్లో పలు గ్రామాలు ముంపు నకు గురయ్యాయి. వరద కాస్తంత శాంతించిన తర్వాత సీఎం జగన్ చాలా తాపీగా బాధితులను పలకరిం చకపోతే బాగోదన్నట్టుగా ప్రయాణమయ్యారు. అలా ఆయన పి.గన్నవరం అనే గ్రామానికి వెళ్లినపుడు సారు వారికి కారులో వెళ్లడానికి అవకాశం లేకపోయింది. అదంతా ఎడ్లబండి, గేదెలు, చెప్పుల్లేని రైతులు తిరిగే దారి. అందువల్ల సీఎం తన కారు కాదని తప్పనిస్థితిలో ట్రాక్టర్ ఎక్కారు.
బహుశా ఆయనకూ ఎన్టీఓడి పాట గుర్తొచ్చే ఉంటుంది. ట్రాక్టర్ నుపరుగు పెట్టించాలనే అనుకొనుండొ చ్చు. కానీ వెళుతోంది బాధితులను పలకరించడానికి కదా అందువల్ల గేదెల నిదానాన్ని అంగీకరించా ల్సి వచ్చింది. పైగా అది సరయిన రోడ్డు కాదు మరింత ఉత్సాహపడద్దని భద్రతా సిబ్బందీ చెప్పి ఉంటుం ది. అసలు అంతకంటే ముందే ఆ దారంతా కాస్తంత శుభ్రపరిచే ఉంటారు. కానీ దారిలో గేదెలే ఎక్కువగా ఆహ్వానం పలికేయి. అవి మనుషులు అందులోనూ జగన్ వీరాభిమానులు కాదు గనుక భద్రతాసిబ్బంది అమాంతం వాటి ఉత్సాహాన్ని నిలువరించి కొమ్ములు గట్టిగా పట్టుకుని ఆపేరు. వాటికి మనుషులు తెలీదు, జనగనన్న పాలనా తెలీదు, ఎప్పుడన్నా కుమ్మేయచ్చుగదా!
కానీ అంత చిత్రమైన ప్రయాణంలోనూ జగన్ తన మాట మాత్రం మార్చుకోలేదు. గేదెలకీ భాష తెలిస్తే వాటి మేతకు గ్రాసం ఏర్పాటు చేసినందుకు తనను వేనేళ్ల పొగిడేవని చెప్పారు. ప్రచారానికి, భజనకీ వేటినీ వదలరు ప్రభువుల వారు. వారికి భుజకీర్తులు ఇపుడు ఎంతో అవసరం. వరదబాధితుల పరామ ర్శకు ట్రాక్టర్ మీద తిరుగుతున్నా మనసు మాత్రం వీటికీ ఓటు హక్కుంటే ఎంత బాగుండేదో అని లోలో పల అనుకుంటోంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-tractor--travel-25-140658.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.