మళ్లీ పాదయాత్రా జగన్.. జనం పారిపోతారు జాగ్రత్త!

Publish Date:Nov 5, 2024

Advertisement

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారా..  వ‌చ్చే నాలుగేళ్లు పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా..?  అన్న ప్రశ్నలకు వైసీపీ వ‌ర్గాల నుంచి అవుననే స‌మాధానమే వినిపిస్తోంది.  2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నద‌ని, కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై త‌న‌పై చంద్ర‌బాబే కేసులు పెట్టించారంటూ ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ క‌న్నీరు పెట్టుకున్నంత ప‌ని చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందారు. సాధార‌ణంగా ఏ రాజ‌కీయ నాయ‌కుడు పాద‌యాత్ర చేసినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తానని,   అండ‌గా ఉంటానని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తారు. కానీ, గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర కేవ‌లం ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు మాత్ర‌మే సాగింది. పాదయాత్రలో తనను కలిసిన వారి బుగ్గలపై ముద్దులు పెడుతూ, బుగ్గ‌లు నిమురుతూ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. అంతేకాక‌.. వైసీపీ అధికారంలోకి వ‌స్తే అద్భుత పాల‌న అందిస్తాన‌ని హామీలు గుప్పించారు. ఒక్క‌ చాన్స్ ఒకే ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్ర‌జ‌ల‌ను  వేడుకున్నారు. జ‌గ‌న్ మాయ‌మాట‌ల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు ఆ ఒక్క చాన్స్ ఇచ్చారు.  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌ట్టం క‌ట్టారు. 

వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంద‌ని భావించిన ప్ర‌జ‌ల‌కు సీఎం పీఠం అదిరోహించిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న విశ్వ‌రూపాన్ని చూపించారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్దిరోజుల‌కే ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని కూల్చేశారు. అక్క‌డి నుంచి రాష్ట్రంలో అరాచ‌క పాల‌నను జ‌గ‌న్ మెద‌లు పెట్టారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టేసి మూడు రాజ‌ధానులు అంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు.  విశాఖ కేంద్రంగా పాల‌న సాగిస్తాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జ‌గ‌న్ హ‌యాంలో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. తెలుగుదేశం, జ‌న‌సేన  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేశారు. మ‌రోవైపు.. ప‌లువురు టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టించి జైళ్ల‌కు పంపించారు. కొంద‌రు పోలీసులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రించారు. అలాగే  జగన్ అరాచ‌క పాల‌న‌ను ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం జైళ్ల‌కు పంపించ‌డం వైసీపీ ఐదేళ్ల పాల‌నలో నిత్య‌కృత్యంగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి మ‌రిచి  కేవ‌లం దోపిడీ చేయడానికే అధికారంలోకి వ‌చ్చామ‌న్న‌ట్లుగా జగన్ ఆయన పార్టీ నేతలు వ్యవహరించారు. 

అధికారం కోసం పాదయాత్ర చేసి, ప్రజలకు ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. తాడేపల్లి ప్యాలెస్ విడిచి బయటకు వచ్చిన ప్రతిసారీ దారి పోవవునా పరదాలు కట్టుకుని తిరిగారు. జనం సమస్యలు పట్టించుకోవడం, పరిష్కరించడం మాట అటుంచి సమస్యలు వినడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. నిలదీసిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో వైసీపీయులు రెచ్చిపోయారు. జగన్ పాలనలో సమాజంలోని ఏ వర్గం సంతోషంగా, భద్రంగా లేని పరిస్థితి నెలకొంది. ఇదేళ్ల పాటు పంటి బిగువున జగన్ అరాచక, దుర్మార్గ పాలనను భరించిన జనం 2024 ఎన్నికలలో గ‌ట్టి షాకిచ్చారు. కసిగా ఓటేసి జగన్ పార్టీని ఘోరంగా ఓడించారు.  క‌నీసం ప్ర‌తిప‌క్ష  హోదానుకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు.   

ఇప్పుడు తెలుగుదేశం కూటమి  అధికారంలో ఉంది. దీంతో జగన్ లో భ‌యం మొద‌లైంది. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం వ‌రుస‌గా కేసులు న‌మోదు చేస్తున్నది. తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లను పోలీసులు అరెస్టుచేయ‌గా.. మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, నారా లోకేశ్ పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్యలు చేసిన వారిపైనా కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. మరో వైపు ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి క్రూరమైన మైండ్ సెంట్ లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరగా.. మరికొందరు వైసీపీ నేతలు రాజీనామాలు చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా మంది నేతలు కూడా పార్టీకి రాంరాం చెప్పేందుకు రెడీగా ఉన్నారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. మరోవైపు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మతో ఆస్తి విబేధాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. దీనికితోడు జగన్ పై పాతకేసుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో అవినీతిపై జగన్ పై కేసులు నమోదు అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి.  

దీంతో జగన్ ను జైలు భయం వెంటాడుతోంది.  తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసే నాటికి పాదయాత్ర పేరుతో  ప్రజల మధ్య ఉండాలని జగన్ భావిస్తున్నారన్న  వైసీపీ వర్గాల్లో చర్చజరుగుతున్నది. పాదయాత్రలో ఉండగా అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాస్తో కూస్తో మేలు జరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పాదయాత్ర ప్రారంభించి.. వీలున్నప్పుడల్లా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లొచ్చని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి మళ్లీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు జగన్ పాదయాత్రను ఎంచుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే, గతంలోలా ప్రజలు జగన్ ను ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను రుచి చూసిన ప్రజలు.. ఈ సారి పాదయాత్ర అంటూ తమ వద్దకు వస్తే ఆహ్వానించడం సంగతి అటుంచి అంటేనే ప్రజలు ఆమడదూరం పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థసారథి మీడియా సమావేశంలో సమావేశంలో వివరించారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు డీకే క్షమాపణలు చెప్పారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ నిలవటంతో ఫ్యాన్స్ భారీగా స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.
ప్రతి ఒక్కరి దైనందిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు.
వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్‌కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్‌రావు పేర్కొన్నారు
ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.బెంగుళూరు ఎయిర్‌ఫోర్ట్‌లో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్‌గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది. హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు.
గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర వాగ్వాదన్నికి దిగారు
క్రి‌కెట్లో రికార్డుల కింగ్‌ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్‌కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.