జగన్ తాడేపల్లి వస్తున్నారహో.. మరో పరామర్శయాత్రకు ముహూర్తం ఫిక్స్!

Publish Date:Jun 30, 2025

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం (జూన్ 30)సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు, తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రధాన్యత ఉండే అవకాశం లేదు. కానీ ఆయన సోమవారం (జూన్ 30) తాడేపల్లికి రానుండటం మాత్రం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎందుకంటే ఇటీవల ఆయన పల్నాడులోని రెంటపాళ్ల పర్యటన సందర్బంగా జరిగిన సంఘటనే. పోలీసు ఆంక్షలను ధిక్కరించి మరీ ఇయన  వందలాది వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా రెంటపాళ్ల పర్యటన చేశారు. ఆ సందర్భంగా ఆయన ఉన్న వాహనం కిందనే పడి వైసీపీ కార్యకర్త సంగమయ్య మరణించారు. దీనికి సంబంధించి జగన్ ఏ2గా కేసు నమోదైంది. దీంతో ఈ కేసు కొట్టివేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జగన్ పిటిషన్ విచారణను జూన్ 1 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జగన్ జూన్ 30 సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో  జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో సోమవారం (జూన్ 30) రాత్రి పార్టీ కీలక నేతలతో భేటీ కానుండటం ప్రాముఖ్యత సంతరించుకుంది.

 అంతే కాకుండా వచ్చే నెల 2న జగన్  నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించుంకుదు నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన అన్నారంటే అతి కచ్చితంగా పరామర్శ యాత్రే అయి ఉంటుంది. జగన్ తన పరామర్శయాత్రల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడమే ధ్యేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే సాధారణంగా తన పరామర్శ యాత్రలు దిగ్విజయమయ్యాయనీ, జన స్పందన బ్రహ్మాండంగా ఉందనీ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక జగన్ యాత్రలలో పరామర్శ సంగతి పక్కన పెడితే.. చంద్రబాబుపై విమర్శలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన  తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారంటే.. ఏదో ఒక పరామర్శ యాత్రకు బయలుదేరడానికేనని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం తాడేపల్లి ప్యాలస్ కు రావడం, పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక వైపు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరో వైపు బుధవారం (జులై2 ) నెల్లూరు పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహమేంటి అన్నదానిపై చర్చించేందుకే జగన్ తాడేపల్లి చేరుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు ఛైర్మన్లను ఖరారు చేసింది.
గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామ చేసిన నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంతో పాటుగా గోషామహల్’నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్న వ్యూహగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోమారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటుగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్’గా విమర్శనా అస్త్రాలు సంధించారు.
బీఆర్ఎస్ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితంగానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుండి ఈ లవ్ లెటర్ (నోటీసులు) అందుకోవాల్సి వచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఐదుగురిపై కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఢిల్లీలో ఏపీ కేంద్రంగా కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ‌రిలో నిర్మాత‌ దిల్ రాజు దిగుతారా? అంటే అవున‌నే తేలుస్తోంది. ఆల్రెడీ ఆయ‌న ఎఫ్ డీ సీ చైర్మ‌న్ గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోనూ అడుగు పెట్టాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం.
వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కరుడుగట్టిన హిదుత్వ వాది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ఇమేజ్ తోనే ఆయన వరసగా మూడు సార్లు బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు.
నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో హంద్రీనీవా కాలువలకు నీటిని విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతు నందికొట్కూరులో ఉండే హంద్రీ-చిత్తూరులోని నీవాని కలపాలి అనుకున్నాప్పుడు అసాధ్యం అన్నారు.
అమర్‌నాథ్ యాత్ర భారీ వర్షాల కారణంగా రద్దైంది. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై క్లారిటీ రాలేదు . యాత్ర సాగుతున్న దారిలో మహిళ ప్రమాదానికి గురైన సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.