వైసీపీ ఖేల్ ఖ‌తం.. బెంగ‌ళూరులోనే ఇక జ‌గ‌న్‌ మకాం!?

Publish Date:Nov 9, 2024

Advertisement

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ చేతిలో  చావు దెబ్బ‌తిన్న వైసీపీ ఖేల్ ఇక ఖ‌తం కాబోతోందా?  ఏపీలో ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. త్వ‌ర‌లో త‌న దుకాణం మూసేయనున్నారా?  అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేగంగా వేస్తున్నది.  అయితే, అధికారం కోల్పోయినా వైసీపీ నేత‌ల్లో మార్పు రాలేదు. ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తుండ‌టంతో పాటు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడుతున్నారు. మార్ఫింగ్ ఫొటోల‌ను పెడుతూ మాన‌సికంగా వేధింపుల‌కు గురిచేస్తున్నారు.

తాజాగా ఈ విష‌యంపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ తోనే చంద్ర‌బాబు స‌రిపెట్ట‌లేదు. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తూ, అరెస్టులు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ  సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో రెచ్చిపోయి వైసీపీ సోష‌ల మీడియా బ్యాచ్ వ‌ణికిపోతోంది. ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని దెబ్బ‌తిన్నామ‌ని, మాపై కేసులు పెట్టొద్ద‌ని వేడుకుంటున్నారు. మ‌రోవైపు వైసీపీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో వైసీపీ క్యాడ‌ర్ చెల్లాచెదురౌతోంది. ఓట‌మి భ‌యంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో  పోటీకి జ‌గ‌న్ వెనుక‌డుగు వేశారు. మ‌రోవైపు అసెంబ్లీకి వ‌చ్చి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తేందుకు కూడా జగన్ భయపడుతున్నారు. అసెంబ్లీకి హాజరు కాను కానీ మీడియా సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ కుంటి సాకులు చెబుతున్నారు. అయితే ఆయన ఇక రాష్ట్రంలో ఉండటం కంటే మకాం మార్చేయడమే సేఫ్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఏపీలో వైసీపీ హ‌యాంలో అరాచ‌కాలు అన్నీఇన్నీ కావు. ప్ర‌తిప‌క్ష నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచి సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కు అధికార పార్టీ నేత‌ల నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు పెట్టి జైల్లో వేయ‌డం.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి మాన‌సికంగా వేధించ‌డం. ఇదేళ్ల జగన్ పాలన అంతా ఇదే తీరు.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌ల‌పై రెచ్చిపోయిన వారిని పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప‌ద‌వులు ఇస్తూ  ప్రోత్స‌హించ‌డంతో వారి ఆగ‌డాల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి లేక‌పోవడం, అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు మితిమీరిపోవడంతో  ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.  క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వ‌కుండా మీ పార్టీ ఏపీలో అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి జనం విస్పష్టంగా చెప్పేశారు.

అయితే వైసీపీ ఘోర పరాజయం, తెలుగుదేశం కూట‌మి ఘన విజయం తరువాతైనా వైసీపీ నేత‌ల వేధింపులు, సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల గొడ‌వ త‌గ్గుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు అవుతున్నా వైసీపీ నేత‌ల్లో మార్పు క‌నిపించ‌డం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌క‌ర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌ను పోస్టులు చేస్తూ  ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఈ విషయాన్ని సీరియ‌స్ గా నిర్ణ‌యం తీసుకున్నారు. ఎ వ‌ర్నీ వ‌దిలిపెట్ట‌కుండా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, పెడుతున్న వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోయిన వారినిపై కేసులు న‌మోదు చేసి అరెస్టులు చేస్తుండ‌టంతో వారు వ‌ణికిపోతున్నారు.

ఏపీలో ఉమ్మ‌డి తూర్పుగోదావరి - పశ్చిమ గోదావరి, ఉమ్మ‌డి కృష్ణా - గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఇటీవ‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, ఆ ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో పోటీ నుంచి వైసీపీ త‌ప్పుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్ల‌లో వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌ట‌మేన‌ట‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపితే చిత్తుచిత్తుగా ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని వైసీపీ అధిష్టానానికి క్లారిటీ రావ‌డంతో పోటీ నుంచి వైసీపీ త‌ప్పుకుంది. అయితే జగన్ తాము పోటీ నుంచి త‌ప్పుకోవ‌టానికి అధికార పార్టీ నేత‌ల అరాచ‌కాలే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. వైసీపీ నేత‌లు మాత్రం కూట‌మి ప్ర‌భుత్వం అరాచ‌క‌పాల‌న సాగిస్తోందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తుండ‌టంతో ప్ర‌జ‌లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీకి వెళ్లి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల్సిన జ‌గ‌న్.. భ‌య‌ప‌డిముఖం చాటే స్తున్నారు. దీంతో  వైసీపీ నేతలలో సైతం జగన్ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంకా జ‌గ‌న్ వెంట ఉంటే  రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండదని పార్టీకి గుడ్ బై కోట్టేయాలని పలువురు నేతలు భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  

అధికారం కోల్పోయిన త‌రువాత అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతుండ‌టంతో పాటు త్వ‌ర‌లో త‌న‌ను కూడా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌న్న భయంతో జగన్  తాడేపల్లి నుంచి బిచాణా ఎత్తేని బెంగళూరు చెక్కేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన నాటి నుంచీ ఎక్కువగా బెంగ‌ళూరులోనే  జగన్ ఉంటున్నారు. ఇప్పుడిక మొత్తంగా ఏపీని వదిలేసి బెంగళూరుకు మకాం మార్చేయాలని భావిస్తున్నారనీ, అక్కడ నుంచే రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని మానిట‌ర్ చేస్తారనీ  వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే బెంగళూరు మకాం మార్చేసిన తరువాత ఆయన పార్టీని పట్టించుకునే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ, పూర్తిగా తన సొంత బిజినెస్ ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయనీ ఆయనను దగ్గరగా తెలిసిన వారు చెబుతున్నారు. దీంతో ఇక ఏపీలో వైసీపీ సీన్ సితార అయిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.