అనుకున్నదే అయ్యింది.. జగన్ తిరుమల టూర్ ఆగింది!

Publish Date:Sep 27, 2024

Advertisement

అనుకున్నట్లే జరిగింది. డిక్లరేషన్ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు కావడానికి కారణమైంది. జగన్ టీటీడీ కోరినట్లు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుంటారని.. ఆయన గురించి తెలిసిన వారెవరూ అనుకోలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ అడుగులు పడ్డాయి. భూమన కరుణాకరరెడ్డి వంటి నాస్తికుడికి టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మానికి వ్యతిరేకి అని చెప్పలేం కానీ ఆయన కచ్చితంగా హిందువు అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం.

కానీ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం తిరుమలలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఆయన హిందూ ధర్మానికి బద్ధ విరోధి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఈ మేరకు గత ఐదేళ్లలో హిందూ సమాజం మొత్తం తిరుమలలో జగన్ చేస్తున్న అరాచకాలపై గగ్గోలు పెట్టింది. తీరు మార్చుకోవాలని సూచించింది.  జగన్మోహన రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో చెప్పనలవి కాదు.  జగన్ హయాంలో  తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ రక్షణ కోసం కాదు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగీ తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దారుణగా దెబ్బతీశాయి. వారిని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి.   టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న  నిర్ణయాలు సహా జరిగిన అపచారాలకు లెక్కేలేదు.  

  తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం  అధికారంలో ఉన్నంత కాలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేశారు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన చెప్పిన దాని కల్లా తలూపుతూ టీటీడీ ఒక ధార్మిక సంస్థ అన్న విషయాన్నే మరిచి పోయింది.  ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దోపిడీయే. తిరుమల వెంకన్నకు భక్తులు నిలువుదోపిడీ ఇస్తారు. అయితే జగన్ హయాంలో భక్తులకు ఆ అవకాశం లేకుండా కొండపైకి వచ్చిన భక్తులను టీటీడీయే నిలువు దోపిడీ చేసేసిందంటే అతిశయోక్తి కాదు.   స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా  జరిగే ప్రసాద వితరణ ఆగిపోయింది. కనీసం జలప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది.   

ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి.  ఇలా  తిరుమల కొండపై జగన్  హయాంలో దేవునికి జరగని అపచారం లేదు.  ఉద్దేశ పూర్వకంగా తిరుమల దేవునికి జగన్ హయాంలో అపచారం జరిగింది. ఇప్పుడు అదే కొండపైకి ఎమ్మెల్యే హోదాలో జగన్ వెళ్లడానికి డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన పరిస్థితి ఇప్పడు జగన్ కు ఎదురైంది.  అయితే ఓట్ల కోసం తప్ప హిందూ దేవాలయాలక వెళ్లే ప్రసక్తే లేదని చెప్పే జగన్ ఎప్పుడో ఐదేళ్ల తరువాత జరిగే ఎన్నికలలో లబ్ధి కోసం ఇప్పుడు తిరుమల వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.