రాజధానులకు జగన్ శఠగోపం?

Publish Date:Sep 8, 2022

Advertisement

మూడు రాజధానుల సాకుతో ఇప్పటిదాకా అమరావతి నిర్మాణాన్ని ఆపేసిన జగన్ లో జనం నుంచి ఛీత్కారాలు వచ్చినా, కోర్టులు మొట్టిక్కాయలు వేసినా మార్పేమీ రాలేదు. అమరావతిపై కసితో, పగతో రగిలిపోతున్న జగన్ ఇప్పుడు ఏపీ రాజధానిని సర్వనాశనం చేసేందుకే పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నారు. రాజధాని ప్రణాళికల్లో మార్పులకు వీలుగా సీఆర్డీయే చట్టానికి సవరణలు చేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదించడమే ఇందుకు ఉదాహరణ. రాజధాని కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు సీఆర్డీయే చట్టానికి విరుద్ధమని గతంలోనే హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు దొడ్డిదారిన ఆ చట్టాన్ని సవరించి అమరావతిని మురికివాడగా మార్చేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద బయటి ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ఏపీ సర్కార్ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపి వేసింది. దీంతో తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్డీయే చట్టాన్నే సవరించాలనే తెంపరితనానికి జగన్ సర్కార్ రెడీ అయిపోయింది. రాజధాని పర్స్ పెక్టివ్ ప్లాన్, బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల ప్లాన్ లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ సీఆర్డీయే చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2014 నాటి సీఆర్డీయే చట్టంలోని 41(1), 41(3) సెక్షన్లను సవరించడంతో పాటు, కొత్తగా 41(6) సెక్షన్ చేర్చింది. 2 (22)సెక్షన్ ను సవరించడంతో పాటు కొత్తగా 53(1) సెక్షన్ జత చేసింది. రాజధానిలో గృహనిర్మాణ పథకానికి రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా అర్హులే అంటూ.. అమరావతిని నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

సీఆర్డీయే చట్టం ప్రకారం రాజధాని పర్స్ పెక్టివ్ ప్లాన్ ను పదేళ్ల దాకా మార్చడానికి వీల్లేదు. తర్వాత కూడా గ్రామసభల ఆమోదంతోనే మార్పుచేర్పులు చేయాలి. అలాంటి అమరావతిలో అశాంతి రేకెత్తించేందుకు, ఘర్షణలు తలెత్తేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు ముసుగులో సీఆర్డీయే చట్టంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్స్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల చట్టంలోనూ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. అయితే వీటిలో సీఆర్డీయే చట్టంలో ప్రతిపాదించిన సవరణలే అత్యంత కీలకమైనవి.

రాజధానికి భూముల్లో బయటివారికి ఇళ్ల స్థలాల కేటాయింపు జోనల్ రెగ్యులేషన్ విధానానికి వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం 2020 మార్చి 23న స్పష్టం చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయడానికి వీల్లేదని, ఉన్నది ఉన్నట్టు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని 2022 మార్చి 3న ఇచ్చిన మరో తీర్పులో హైకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. దానికి భిన్నంగా ఇప్పుడు రాజధాని మాస్టర్ ప్లాన్లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం సీఆర్డీయే చట్టానికి సవరణలు తేవడం హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించడమే అవుతుందంటున్నారు. పర్సన్ ఇన్ చార్జులుగా ఉన్న ప్రభుత్వ అధికారుల నుంచి ప్రతిపాదన తీసుకుని, రాజధాని ప్రణాళికల్లో మార్పులు చేసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని న్యాయనిపుణులు అంటున్నారు. సీఆర్డీయే చట్టంలో గతంలో లేని సెక్షన్ 53(1)ని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించింది.

అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో 1251 ఎకరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 25న జీఓ 107 జారీ చేసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం సీఆర్డీయే చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం. 107ని సస్పెండ్ చేసింది. అయినప్పటికీ చట్టాన్నే సవరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం.

ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ వైసీపీకి లేదని, ప్రస్తుత ప్రభుత్వానికి కూడా త్వరలోనే నూకలు చెల్లిపోయే పరిస్థితి రావచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకే తన శక్తియుక్తులను వినియోగించాల్సిన జగన్ రెడ్డి ఒక్క అమరావతికే కాదు.. తానే చెబుతున్న మూడు రాజధానుల అంశానికి కూడా ఎగనామం పెట్టేయొచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.