అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్టర్ గా సజ్జల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగన్న పాలనలో ఇటు ధనుంజయ్ రెడ్డి, అటు సజ్జల.. ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జల అయితే వైయస్ జగన్ తలరాత తిరగరాసినట్టుగా భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్ కి చాలా విషయాలు చేరక పోయేవని చెబుతారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాడాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్టుగా ఒక అంచనా.
అలాంటి సజ్జలను తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరముందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.
ఏమాటకామాట విజయసాయి రెడ్డి కలసి వచ్చినట్టు సజ్జల జగన్ కి కలసి రాలేదని అంటారు చాలా మంది జగన్ అభిమానులు. ఈయనకు ఏదీ నడపటం సరిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో కనీసం ఏబీసీడీలు తెలీవని వాపోతారు. అంతెందుకూ.. తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినపుడు.. కొన్ని చానెళ్లలో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు.
తనకు తాను రక్షించుకోలేని వాడు.. జగన్ ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్ కి ఇంకా అర్ధం కావడం లేదు. అప్పట్లో విజయసాయి రెడ్డి అంత రేంజ్ లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయి రెడ్డి జగన్ ఆస్తుల, ఆర్ధిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్టుగానే చెబుతారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారుగానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటకు రాలేదని సమాచారం.
ఇదలా ఉంచితే, పార్టీకి సరిగ్గా అలాంటి వ్యక్తి అవసరముంది కానీ, సజ్జల లాంటి వారు కాదన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణులు బాహటంగా అంటోన్న మాట. మరి సజ్జల కాకుండా ఇంకెవరున్నారు. అన్న చర్చ కూడా నడుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యులను అంత తేలిగ్గా ఎంటర్ టైన్ చేయదు. దీంతో సజ్జలకు ఇంకా ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని భావిస్తున్నారు. సజ్జల ఫేస్ చూసి చూసి జనానికి బోర్ కొట్టేసిందని.. ఆయన వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండదని.. అంత రసవత్తరంగా కూడా ఆయన మాట్లాడలేడు కాబట్టి మాకు నీరసం వస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-should-change-brand-sajjala-39-205639.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.