అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్టర్ గా సజ్జల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగన్న పాలనలో ఇటు ధనుంజయ్ రెడ్డి, అటు సజ్జల.. ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జల అయితే వైయస్ జగన్ తలరాత తిరగరాసినట్టుగా భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్ కి చాలా విషయాలు చేరక పోయేవని చెబుతారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాడాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్టుగా ఒక అంచనా.
అలాంటి సజ్జలను తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరముందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.
ఏమాటకామాట విజయసాయి రెడ్డి కలసి వచ్చినట్టు సజ్జల జగన్ కి కలసి రాలేదని అంటారు చాలా మంది జగన్ అభిమానులు. ఈయనకు ఏదీ నడపటం సరిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో కనీసం ఏబీసీడీలు తెలీవని వాపోతారు. అంతెందుకూ.. తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినపుడు.. కొన్ని చానెళ్లలో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు.
తనకు తాను రక్షించుకోలేని వాడు.. జగన్ ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్ కి ఇంకా అర్ధం కావడం లేదు. అప్పట్లో విజయసాయి రెడ్డి అంత రేంజ్ లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయి రెడ్డి జగన్ ఆస్తుల, ఆర్ధిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్టుగానే చెబుతారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారుగానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటకు రాలేదని సమాచారం.
ఇదలా ఉంచితే, పార్టీకి సరిగ్గా అలాంటి వ్యక్తి అవసరముంది కానీ, సజ్జల లాంటి వారు కాదన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణులు బాహటంగా అంటోన్న మాట. మరి సజ్జల కాకుండా ఇంకెవరున్నారు. అన్న చర్చ కూడా నడుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యులను అంత తేలిగ్గా ఎంటర్ టైన్ చేయదు. దీంతో సజ్జలకు ఇంకా ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని భావిస్తున్నారు. సజ్జల ఫేస్ చూసి చూసి జనానికి బోర్ కొట్టేసిందని.. ఆయన వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండదని.. అంత రసవత్తరంగా కూడా ఆయన మాట్లాడలేడు కాబట్టి మాకు నీరసం వస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-should-change-brand-sajjala-25-205640.html
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.