అన్నిటికీ ఇంకా సజ్జలేనా అన్నది ప్రెజంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్ మెంట్స్ హోల్ సేల్ మినిస్టర్ గా సజ్జల పెద్ద ఎత్తున ఒక వెలుగు వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగన్న పాలనలో ఇటు ధనుంజయ్ రెడ్డి, అటు సజ్జల.. ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జల అయితే వైయస్ జగన్ తలరాత తిరగరాసినట్టుగా భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్ కి చాలా విషయాలు చేరక పోయేవని చెబుతారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాడాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్టుగా ఒక అంచనా.
అలాంటి సజ్జలను తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను అలాగే అంటి పెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరముందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని.. ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకుని.. ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు.
ఏమాటకామాట విజయసాయి రెడ్డి కలసి వచ్చినట్టు సజ్జల జగన్ కి కలసి రాలేదని అంటారు చాలా మంది జగన్ అభిమానులు. ఈయనకు ఏదీ నడపటం సరిగా రాదు. పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్టు చెప్పుకు తిరుగుతారు కానీ, మీడియా మేనేజ్మెంట్లో కనీసం ఏబీసీడీలు తెలీవని వాపోతారు. అంతెందుకూ.. తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినపుడు.. కొన్ని చానెళ్లలో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకుని.. నేనేమైనా దేశ ద్రోహినా అంటూ మొహం వేలాడేశారు.
తనకు తాను రక్షించుకోలేని వాడు.. జగన్ ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్ కి ఇంకా అర్ధం కావడం లేదు. అప్పట్లో విజయసాయి రెడ్డి అంత రేంజ్ లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయి రెడ్డి జగన్ ఆస్తుల, ఆర్ధిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్టుగానే చెబుతారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారుగానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటకు రాలేదని సమాచారం.
ఇదలా ఉంచితే, పార్టీకి సరిగ్గా అలాంటి వ్యక్తి అవసరముంది కానీ, సజ్జల లాంటి వారు కాదన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణులు బాహటంగా అంటోన్న మాట. మరి సజ్జల కాకుండా ఇంకెవరున్నారు. అన్న చర్చ కూడా నడుస్తోంది. బేసిగ్గా వైసీపీ అన్యులను అంత తేలిగ్గా ఎంటర్ టైన్ చేయదు. దీంతో సజ్జలకు ఇంకా ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోందని భావిస్తున్నారు. సజ్జల ఫేస్ చూసి చూసి జనానికి బోర్ కొట్టేసిందని.. ఆయన వాక్య నిర్మాణం కూడా ఏమంత బాగుండదని.. అంత రసవత్తరంగా కూడా ఆయన మాట్లాడలేడు కాబట్టి మాకు నీరసం వస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-should-change-brand-sajjala-25-205640.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.