వాలంటీర్ల‌కు జ‌గ‌న్‌ షాక్.. బాబు భరోసా!

Publish Date:Apr 10, 2024

Advertisement

వాలంటీర్ల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకిస్తే.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు భరోసా ఇచ్చారు.  ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ వేళ ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ.. వారి సేవ‌ల‌ను త‌ప్పుడు ప‌ద్ద‌తుల్లో వినియోగించుకుంటున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. వాలంటీర్ల స‌హాయంతో ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటా సేక‌రిచ‌డంతోపాటు, వారిని వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా జ‌గ‌న్‌ మార్చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వారిని పార్టీ ప్ర‌చారానికి ఉప‌యోగించుకొని ల‌బ్ధిపొందాల‌ని జ‌గ‌న్ కుట్ర‌ చేశారు. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీ కుట్ర‌ల‌కు చెక్‌ పెట్టింది. వాలంటీర్ల సేవ‌ల‌ను ఎన్నిక‌ల కోడ్ పూర్త‌య్యే వ‌ర‌కు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్ణ‌యంతో షాక్ కు గురైన వైసీపీ అధిష్టానం.. కొత్త కుట్ర‌కు తెర‌లేపింది. వాలంటీర్లంద‌రినీ రాజీనామా చేయించి పార్టీ ప్ర‌చారంలో వాడుకోవాల‌ని వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేయ‌గా.. మెజార్టీ వాలంటీర్లు ఇదంతా వైసీపీ కుట్ర‌లో భాగ‌మ‌ని గుర్తించి రాజీనామాకు స‌సేమిరా అన్నారు. అయితే  రాజీనామా చేయ‌ని వారిని మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చాక తొల‌గిస్తామ‌న్న బెదిరింపుల‌కు  వైసీపీ నేత‌లు దిగారు. దీంతో ఆందోళ‌న‌లో ఉన్న వాలంటీర్ల‌కు చంద్ర‌బాబు నాయుడు అండ‌గా నిలిచారు. దీంతో వాలంటీర్ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఏపీలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై పెద్దచ‌ర్చే జ‌రుగుతుంది. ఇటీవ‌ల‌ ఎన్నిక‌ల సంఘం వాలంటీర్ల‌ను  పెన్షన్ల పంపిణీ కి దూరంగా ఉంచాలని ఆదేశించింది. వారికి ప్ర‌భుత్వం ఇచ్చిన ట్యాబ్ లు, సెల్ ఫోన్లు వెన‌క్కు తీసుకుంది. ఇత‌ర మార్గాల ద్వారా వృద్ధుల‌కు ఇంటివ‌ద్ద‌కే వెళ్లి పెన్ష‌న్ ఇవ్వాల‌ని  ఆదేశించింది. దీంతో వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారంతో ల‌బ్ధిపొందాల‌ని చూసింది. వృద్ధుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల కూట‌మి పెన్షన్ల పంపిణీని అడ్డుకుంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. వృద్ధుల‌కు, న‌డ‌వ‌లేని వారికి ఇళ్ల‌కు వెళ్లి పెన్ష‌న్ అందించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించినా.. ఆ ఆదేశాల‌ను అధికారులు ప‌క్క‌న పెట్టారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెన్ష‌న్లు ఇవ్వ‌కుండా అడ్డుకున్నారంటూ వైసీపీ నేత‌లు అస‌త్య ప్ర‌చారాన్నిచేశారు. దీనికితోడు.. చంద్ర‌బాబు ఫిర్యాదుతోనే స‌చివాల‌యం వ‌ద్ద‌నే పెన్ష‌న్లు ఇవ్వాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించిందంటూ వృద్ధుల‌ను మండుటెండ‌లో మంచాల‌పై పెన్ష‌న్ కోసం తీసుకెళ్లి, ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశారు. త‌ద్వారా కూట‌మి అధికారంలోకి వ‌స్తే వృద్ధులు, పెన్ష‌న్ దారుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ నేత‌ల త‌ప్పుడు ప్ర‌చారం వ‌ల్ల పెన్ష‌న్ కోసం మండుటెండ్ల‌లో వెళ్లి ప‌దుల సంఖ్య‌లో వృద్ధులు మ‌ర‌ణించారు. ఒక‌ప‌క్క ఎన్నికల సంఘం వృద్ధుల‌కు, న‌డ‌వ‌లేని వారికి ఇంటింటికి వెళ్లి పెన్ష‌న్ ఇవ్వాల‌ని ఆదేశిలిచ్చినా, త‌ప్పుడు ప్ర‌చారంలో వైసీపీ ల‌బ్ధిపొందాల‌ని చూసింది. వైసీపీ కుట్ర‌లు ప్ర‌జ‌ల‌కు అర్ధంకావ‌టంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావించి వైసీపీ ఆ  డ్రామాకు స్వ‌స్తి చెప్పింది.

వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను వైసీపీ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి త‌ప్పుడు ప‌నుల‌కుకూడా ఉప‌యోగించుకుంది. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటాను సేక‌రించ‌డంతోపాటు, పెన్ష‌న్ దారులుపై వైసీపీకే ఓటు వేయాల‌ని ఒత్తిడి తెచ్చారు. దీంతో  వైసీపీ సానుభూతి ప‌రుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తూ  తెలుగుదేశం, జ‌న‌సేన సానుభూతి ప‌రుల‌కు పెన్ష‌న్లు రాకుండా ఇబ్బందులు పాలుచేశారు. ఆది నుంచి వాలంటీర్లు అంటే వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ముద్ర‌ప‌డిపోయారు. దీంతో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యంతో వాలంటీర్లు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేత‌లు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామా చేయ‌ని వాలంటీర్ల‌ను మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తామంటూ బెదిరింపుల‌కు  దిగుతున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు వాలంటీర్ల‌కు భ‌రోసా ఇచ్చారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు నెల‌కు రూ. 10వేలు వేత‌నం ఇస్తామ‌ని ఉగాది రోజున శుభ‌వార్త చెప్పారు. వాలంటీర్ల‌ను మంచి ప‌నులకు ఉప‌యోగిస్తామ‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా చూడ‌బోమ‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసే వాలంటీర్ల‌కు తాము ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. 

కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తొల‌గిస్తార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీని మ‌రోసారి గెలిపించుకుంటేనే వాలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కూట‌మి అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు జీతం రూ.10వేలకు పెంచుతామ‌ని చెప్ప‌డం ప‌ట్ల వాలంటీర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తామ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి నిజంలేద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు హామీతో మెజార్టీ శాతం వాలంటీర్లు ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేత‌ల పెత్త‌నంతో తాము అనేక ఇబ్బందులు ప‌డ్డామ‌ని, చంద్ర‌బాబు హామీతో కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికి తాము కృషిచేస్తామ‌ని ప‌లువురు వాలంటీర్లు బ‌హిరంగాంగా చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ వాలంటీర్ల‌ను అడ్డుపెట్టుకొని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో గ‌ట్టి షాకిచ్చిన‌ట్లయింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు వాలంటీర్ల‌కు ఇచ్చిన హామీతో వైసీపీ అభ్య‌ర్థులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక విజయంపై తమలో దింపుడు కళ్లెం ఆశ కూడా మిగలలేదని పలువురు వైసీపీ అభ్యర్థులు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.