Publish Date:Apr 26, 2024
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే.. నువ్వు చెల్లికి అప్పు ఇచ్చినట్టు వుంది.. కానీ, అది అప్పు కాదని, తనకు ఆస్తిలో వాటాగా రావలసిన చాలా డబ్బులో కొంత డబ్బుని ‘అప్పు’ రూపంలో ఇచ్చావంటా? ఈ విషయం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు.. చెల్లెమ్మ చేతికి మైకు ఇస్తే చాలు ముందుగా తనకు రావలసిన తన ఆస్తి గురించే మాట్లాడుతోంది మరి. ఆమె అలా రోడ్డు మీదకి వచ్చి తన ఆస్తి గురించి లబోదిబో అంటోంది కాబట్టి, ఇష్యూ పబ్లిక్లోకి వచ్చేసింది కాబట్టి మీ కుటుంబ ఆస్తి వివరాల గురించి మాట్లాడే అవకాశం అందరికీ మీరే ఇచ్చినట్టు అయింది.
ఆ మహానేత, నాన్నగారు పోయిన తర్వాత ఆయన ‘కష్టపడి’ సంపాదించిన మొత్తం అన్నాచెల్లెళ్ళు మీరిద్దరూ పంచుకోవాలి కదా.. ఆయన కీర్తిశేషుడై చాలా సంవత్సరాలైంది. ఇంతవరకు ఆస్తుల పెంపకం ప్రస్తావన తేకుండా మొత్తం నీ దగ్గరే వుంచేసుకుంటే ఎలా జగన్ బ్రో? పాపం ఆయన ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోయారు. ఒకవేళ ఆయనే బతికుంటే, చక్కగా ఆస్తిమొత్తాన్నీ ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చి వుండేవారు కదా? తండ్రి తర్వాత తండ్రి లాంటి నువ్వు పాపం నీ చెల్లికి తండ్రి లేని లోటు తీర్చి ఆస్తి పంచి ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా.
ఆస్తి వస్తుంది, పోతుంది.. ఆత్మీయతలు, అనురాగాలు పోతే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఒక్కగానొక్క చెల్లిని ఏడిపించకుండా ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకి ఇస్తే మీ అనురాగాలు కొనసాగుతాయి.. అంతేకాదు.. పైన వున్న మీ నాన్న వైఎస్సార్, తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా కూడా చాలా సంతోషిస్తారు. అయినా అంత డబ్బు ఏం చేసుకుంటావ్ జగన్? మీ తాత, మీ నాన్న అంత సంపాదించి ఏం చేసుకున్నారు? ఒక్క రూపాయి అయినా తీసుకెళ్ళారా? ఎవరైనా అంతే, మొన్న కంటికి పైన తగిలిన రాయి ఏ కణతకో తగిలి వుంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకని, ఇప్పటి వరకు అయిన రచ్చ చాలు.. ఇక ఈ రచ్చకి ఫుల్స్టాప్ పెట్టాల్సిన బాధ్యత నీదే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-sharmila-property-issue-25-174567.html
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.