Publish Date:Jan 22, 2024
ఏపీలో ఇప్పుడు వైఎస్ కుటుంబ రాజకీయ రణం ఓ రేంజ్ లో ప్రారంభమైంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు షర్మిల రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. రాజధాని నగరానికి వచ్చే దారిలో ఆమె కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించడంతో రానున్న రోజులలో అన్నా చెళ్లెల్ల పొలిటికల్ వార్ ఏ స్థాయిలో సాగనుందన్న విషయం అందరికీ అవగతమైంది. ఈ వార్ లో మాటల తూటాలే కాదు, కుటుంబ రహస్యాలూ ఫైర్ వర్క్స్ మాదిరిగా ఆకాశమే హద్దుగా బయటకు వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నయ్య జగన్ సర్కార్ పతనమే అజెండాగా చెల్లి షర్మిల ఏపీలో అడుగుపెట్టారు. ఆమె కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకోవడానికి ముందే ఏపీలో పోలీసు వ్యవస్థ పంజా విసిరింది. అన్న సర్కార్ ఇలా ఆదేశాలు జారీ చేసిందో లేదో.. అలా పోలీసులు ఆమె కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అయితే ఇటువంటి ఉడుత బెదరింపులకు బెదిరే రకం కాదు వైఎస్ బిడ్డ షర్మిల. అసలే ఫైర్ బ్రాండ్.. ఈ ఘటనే నాందిగా ఆమె అన్న సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏపీ కాంగ్రెస్ దళపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఆదివారం, గన్నవరం నుంచి బెజవాడకు భారీ కాన్వాయ్లో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కాన్వాయ్ ని ఆపేశారు. దారి మళ్లాలని ఆదేశించారు. అయితే షర్మిల ససేమిరా అన్నారు. ఏపీలో నియంత పాలన నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కారు వణికిపోతోంది. అంటూ ఎలుగెత్తారు.
అక్కడితో ఆగకుండా ఏంటి సార్ మమ్మల్ని చూసి భయపడుతున్నారా? ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా? మీ అక్రమాలిక సాగవు. కార్యకర్తల కోసం జైలుకయినా వెళతా అంటూ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల వైఖరికి నిరసనగా షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దానితో దిగొచ్చిన పోలీసులు షర్మిల కాన్యాయ్ను అనుమతించారు. ఈ పరిణామంతో గంటల తరబడి ట్రాఫిక్ చాలాసేపు జామయింది. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే.. పోలీసులు ఓవరాక్షన్ చేశారని ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా కాంగ్రెస్ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశాలు రాకపోతే వైఎస్ బిడ్డ షర్మిలను ఆపే ధైర్యం పోలీసులు చేయరని అంటున్నారు. సీఎం జగన్ ఆదేశాలు, సజ్జల డైరక్షన్ ప్రకారమే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోలీసులు ఇప్పటికైనా జగన్ సర్కారు భజన మానకపోతే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ హెచ్చరించింది.
కాగా.. వైఎస్కు అసలైన వారసురాలొచ్చిదంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ఈ సందర్భంగా ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉటుంది. ఇక తనను పోలీసులు అడ్డుకోవడం వరకూ అన్న జగన్ పై విమర్శల విషయంలో కొంచం ముందు వెనుకలాడిన షర్మిల ఇక ఏ శషబిషలూ లేకుండా జగన్ కు నేరుగా లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చేశారు. ఏపీలో నియంత రాజ్యం నడుస్తోంది, అయితే రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదు, రాష్ట్రంలో నియంత పాలనను అంతం చేస్తా అంటూ ప్రతిన పూనారు షర్మిల. ఆ నియంత జగనేననీ, తాను అంతమొందించేది జగన్ పాలననేననీ షర్మిల ఇంత కంటే నేరుగా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ ఒక్క హెచ్చరికతో షర్మిల అన్నపై రాజకీయ యుద్ధం ప్రకటించేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-sharmila-political-fight-39-169166.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.