జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దు

Publish Date:Sep 30, 2013

Advertisement

 

 

 

ఇడుపుల పాయకు, గుంటూరుకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సాయంత్రం తీర్పివ్వనుంది. ఐతే జగన్ ను హైదరాబాదు విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతు నుంచి జగన్‌కు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. ఆయన నగరాన్ని విడిచి వెళితే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది. 16 నెలల జైలు వాసం తర్వాత వారం క్రితం జగన్ బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు. దీంతో పాటు గుంటూరుకు కూడా వెళ్లేందుకు అనుమతించాలన్నారు.

By
en-us Political News

  
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేమిటంటే ఎవరి మాటా వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంత వరకూ యాప్ట్ అన్నది పక్కన పెడితే.. ఎవడి మాటా వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికి నట్లు సరిపోతుంది. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి షాకిచ్చారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేదు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు ఆవలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనిని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ పోల్స్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనా వేశాయి.
తెలుగుదేశంలో వున్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన సైబరాబాద్ మొక్క విడదల రజిని, ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ లో కొన్ని ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అంచనా వేస్తే మరి కొన్ని ఢిల్లీపీఠంపై కమలనాథుల జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ క ల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.
జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది. వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు హ‌ద్దే లేకుండా పోయింది.
ఈ మూడుమార్గాలు కాకుండా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి నిండు లోకసభలో కామెంట్ చేయడంతో ప్రజాస్వామ్యం పట్ల  సదరు ఎంపీగారికి ఉన్న అవగాహన ఏంటో తెలియజేస్తుంది 
జగన్ అరాచకపాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికి రాష్ట్రం అన్ని రంగాలలో అధమ స్థానంలో ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.