Publish Date:Aug 28, 2022
ఇంటిల్లపాదినీ సంతోషంగా జీవించేలా చూడటం ఇంటిపెద్ద కర్తవ్యం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటూ అందరి ఆనందాన్ని కోరుకోవడం ఇంటి పెద్ద ధర్మం. ఇదే ధర్మం రాష్ట పాలకులకు వర్తిస్తుంది. ప్రజలందరినీ ప్రశాంతంగా, సంతోషంగా జీవించేలా చూడటం ప్రభుత్వం, సీఎం ధర్మం. అలాగాకుండా ప్రభుత్వమే అడ్డంకులు కల్పిస్తూ, ముఖ్యమంత్రి, అధికారులు అన్ని రకాల అడ్డంకులు పెడుతూంటే ప్రజలు ఎలా ఉంటారు. ఏపీలో రాను రాను పరిస్థితులు ప్రజాహితంగా లేవన్నది విమర్శకుల మాట. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్ అందుకు అద్దంపడుతోంది.
ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టంలేకుండా పోయిందని ఆయన మీడియాతో అన్నారు. దీనికితోడు పండగలు నిర్వహించుకోవాలా వద్దా అన్నది కూడా ప్రభుత్వం అనుమతి తీసుకున్నతర్వాతనే అన్నది మరీ దారుణమని ఆగ్రహించారు.
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ వినాయకచవితికి సిద్ధపడడంలో ప్రజలు తలమునకలయ్యారు. విగ్రహాల ఏర్పాటు విషయంలో కొన్ని సాధారణ ఆంక్షలు ఉంటాయి. కానీ ఆంక్షలు హద్దులు మీరి ఉంటున్నాయన్నారు.
...
తాడిపత్రి ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టం లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారులు దయ దాక్షిణ్యాలతో హిందూ పండుగలు నిర్వహించుకోవాలా? అని ప్రశ్నించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి యువత నిరీక్షిస్తు న్నా రని మండిపడ్డారు.
వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణతో వైసీపీ పతనం మొదలైందని ప్రభాకర్ న్నారు. శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదన్నారు. మున్సిపల్ చైర్మన్ అయిన తనకే అనుమతి కోసం ఆయా అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చెయ్యి స్వామి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-rule-full-of-restriction-25-142797.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!