జగన్ రూటే సెపరేటు.. మొంథా తుపాను నష్టం పరిశీలన టూ లేటు

Publish Date:Nov 5, 2025

Advertisement

వైసీపీ అధినేత జ‌గ‌న్  రూటే సెపరేట్. ఆయన మాటలతో నేల విడిచి సాము చేస్తారు. ఏ విషయమైనా సరే.. తానైతేనా అని చెప్పుకుంటారు. తన మాటలను ఎవరైనా విశ్వసిస్తున్నారా? లేదా అన్న అనుమానమే ఆయనకు రాదు. ప్రత్యర్థులను విమర్శించడానికీ తనను పొగుడుకోవడానికీ మాత్రమే ఆయన నోరు తెరుస్తారు. అది ప్రెస్ మీట్ అయానా, బహిరంగ సభ అయినా, పరామర్శ యాత్ర అయినా, ఓదార్పుయాత్ర అయినా ఆయన ప్రసంగ సారాంశం ఒక్కటే.. సకల సమస్యల పరిష్కారం తన చేతిలో ఉందని చచెప్పడమే.

తాజాగా కృష్ణా జిల్లాలో మొంథా తుఫాను ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆయన మంగళవారం (నవంబర్ 4) ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయన స‌హ‌జంగానే  తెలుగుదేం కూటమి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ విమర్శల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. తాను ఉంటే మొంథా తుపాను వచ్చేదే కాదన్నట్లుగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దీంతో అంతా విస్తుపోయారు.

  కృష్ణాజిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను జ‌గ‌న్ పరిశీలించారు. అయితే రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు.  ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు.  మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక  జిల్లాల్లో పంట‌న‌ష్టం జ‌రిగింద‌న్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు. రైతులకు అండగా తాను ఉంటాన్నన్నారు. వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాన్నారు.  మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.  రాష్ట్రంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.  రైతుల‌కు స‌రైన స‌మ‌యంలో సొమ్ములు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు.  నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైసీపీ వారికి అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు.  కూట‌మి పాల‌న‌లో రైతుల‌కు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వ‌డం లేదని విమర్శించారు.

అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం జగన్ చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఈ విషయాన్ని రైతులే చెబుతున్నారు.సాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందుగా విపక్ష నేత క్షేత్ర స్థాయికి చేరుకుని, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో మమేకమై అండగా ఉన్నామనీ, ఉంటామనీ హామీ ఇచ్చి ప్రజలతో మమేకమౌతారు. తద్వారా విపత్తు కారణంగా నష్టపోయిన వారికి సత్వరసాయం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలలో  మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా నిలిచారు. అదే సమయంలో వైసీపీ అధినేత బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై ఉన్నారు. అక్కడ నుంచే బాధితులకు అండగా నిలవాలంటూ పార్టీ నేతలూ, శ్రేణులకూ పిలుపునిచ్చారు. కానీ యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా.. అధినేతకే పట్టనప్పుడు తమకెందుకు అనుకున్నట్లుగా వైసీపీయులెవరూ గడపదాట లేదు.  

మొంథాతుపాను తీరం దాటిన తరువాత ప్రభావిత ప్రాంతాలలో  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు  క్షేత్ర స్థాయిలో తిరిగారు. బాధితులను నేరుగా కలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు భరోసా ఇచ్చి ధైర్యం నింపారు. ఇదంతా జరుగుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ కనీసం రాష్ట్రంలో లేరు. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.    తుపాను వచ్చి వెళ్లిపోయిన వారం రోజుల తరువాత ఆయన తీరిగ్గా తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వచ్చారు.

అయితే అప్పటికే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పలువురు మంత్రులు తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, జరిగిన నష్టాన్ని పరిశీలించి, కేంద్రానికి నివేదిక పంపి తగు విధంగా ఆదుకోవాలని కోరడం కూడా జరిగిపోయింది. జగన్ పర్యటన చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం మంకుపట్టు పట్టి కూర్చున్న జగన్ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా ఆయన తన బాధ్యతలను పూర్తిగా విస్మరించారనీ, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు పూర్తిగా ముఖం చాటేసి ఇప్పుడు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వల్ల ప్రయోజనం ఇసుమంతైనా ఉండదనీ అంటున్నారు.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.