ఐ బాబోయ్ జగన్.. బినామీ పేరుతో సిమ్ కార్డు.. సిగ్నల్ యాప్ లో సీక్రెట్ చాట్!

Publish Date:May 16, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం.  జగన్ ఫోన్లు, యాప్ లు, గాడ్జెట్ల వాడకం తనకు ఇష్టం ఉండదని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు. తాను ఫోన్ ఉపయోగించననీ, తేనకు అసలు ఫోనే లేదనీ, ఇక నంబర్ ఎక్కడ నుంచి వస్తుందనీ పలు సందర్భాలలో చెప్పుకున్నారు. సీఏంగా ఉన్న ఐదేళ్లూ, పరాజయం తరువాత పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన తరువాత చాలా రోజుల వరకూ ఫోన్ జోలికి వెళ్లని జగన్ ఇప్పుడు ఏకంగా ఐఫోన్ కొనుక్కుని దానితో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న అనుమానాలు సహజంగానే అందరిలోనూ వ్యక్తం అవుతాయి. అలాగే వ్యక్తం అవుతున్నాయి కూడా.

ఇంతకీ ఇంత హఠాత్తుగా తన సొంతానికి ఫోన్ అత్యవసర వస్తువుగా జగన్ కు ఎందుకు మారిపోయింది అంటే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తరువాత ఒకరుగా జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్టౌతున్నారు. ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ అరెస్టయ్యారు. వీరిలో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా భారతీ సిమెంట్స్ జీవిత కాల డైరెక్టర్ గోవిందప్ప అరెస్టయ్యారు. దీంతో  మద్యం కుంభకోణం తీగలు కదిలాయి.. ఇక తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడమే తరువాయి అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.  జగన్ హయాంలో సీఎంవోలో చేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా నోటీసులు అందుకుని విచారణకు హాజరౌతున్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు? అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది? ఎవరేం చెబుతున్నారు? ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండటం అవసరం అని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లూ లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఓ ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకే జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారంటున్నారు.   భద్రతా పరంగా ఐఫోన్ మిన్న అంటారు. అందుకే జగన్ ఐఫోన్ కొనుగోలు చేశారనీ, ఆయన సిగ్నల్ యాప్ ను ఉపయోగిస్తున్నారనీ తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా చేసిన ఛాట్ నిర్దుష్ట సమయం తరువాత ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. పూర్తిగా ఎరైజ్ అయిపోతుంది. ఎంత సమయంలో చాటింగ్ డేటా ఎరైజ్ అయిపోవాలన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఎ రకంగా చూసినా ఇది  సేఫ్ అని భావించడం వల్లనే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనకు అవసరమై సమయంలో అవసరమైన మేరకు చాటింగ్ చేసి.. ఆ వెంటనే ఎరేజ్ చేసుకునే సౌకర్యం ఉండటంతో జగన్ సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారంటున్నారు.  సిగ్నల్ యాప్ ద్వారా చేసిన చాటింగ్ ట్రేస్ చేయడానికి సాధ్యం కాదనీ, ఎక్కడా సేవ్ కాదనీ చెబుతున్నారు.  అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయాన్ని మద్యం కుంభకోణం దర్యాప్తు అధికారులు కూడా ధృవీకరించారు. కేవలం సిగ్నల్ యాప్ మాత్రమే కాకుండా ఫేస్ టైం యాప్ ద్వారా కూడా జగన్ మాట్లాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జగన్ ఐఫోన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.  మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు, నిందితుల విచారణ తదితర వివరాలను మినిట్ టు మినిట్ తెలుసుకుంటున్నారని అధికారులు అంటున్నారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ వాడుతున్న ఐఫోన్ సిమ్ కార్డు ఆయన  పేరు మీద కాకుండా ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన బినామీ పేరు మీద తీసుకున్నారనీ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.