రక్తికట్టని వైసీపీ డ్రామాలు.. జ‌గ‌న్ లేఖను ప‌ట్టించుకోని పార్టీల అధినేతలు

Publish Date:Sep 24, 2024

Advertisement

తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలో వైసీపీ నేత‌ల డ్రామాలు ర‌క్తి కట్టడం లేదు. త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో డ్రామా ఆడుతున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొద‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రించే వ్యూహాన్నే తిరుప‌తి ల‌డ్డూ విష‌యంలోనూ అమ‌లు చేస్తున్నారు. గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో త‌ప్పుచేసిన‌ట్లు ఆధారాల‌తో స‌హా దొరికిపోయినప్పుడు.. జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ప‌దేప‌దే ప్రెస్ మీట్లు పెట్టి అది త‌ప్పుకాదు అంటూ వితండ‌వాదం చేశారు. త‌మ అనుకూల మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేసుకొని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ విష‌యంలోనూ జ‌గ‌న్‌, ఆయ‌న మీడియా ఇదే ఫార్ములాను అనుస‌రించింది. చంద్ర‌బాబు నాయుడే వివేకానంద ఇంటికి వెళ్లి క‌త్తితో దాడి చేశారు అన్న‌ట్లుగా నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ ప్ర‌చారం చేశారు. అంతేకాక‌.. ఓ కులంపైనా త‌ప్పుడు ప్ర‌చారంతో జ‌గ‌న్ దాడి చేశారు. ఆ కులాన్ని కించ‌ప‌రిచేలా, ఆ కులంపై ఇత‌ర కులాల వారిని రెచ్చ‌గొట్టేలా జ‌గ‌న్ అనుకూల మీడియా, సోషల్ మీడాయా ద్వారా  ప్ర‌య‌త్నాలు చేశారు. అలాంటి ప్రచారాల ద్వారానే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. తాజాగా తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలోనూ జ‌గ‌న్ తూచాత‌ప్ప‌కుండా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

 వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యి క‌ల్తీద‌ని ల్యాబ్ రిపోర్టులు స్ప‌ష్టం చేశాయి . 8 జులై 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ జులై 17న నివేదిక ఇచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం.. లడ్డూలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లు తేలింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన ప‌నితో  ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యారు. ఒక్క ల‌డ్డూ విష‌యంలోనేకాక తిరుప‌తిలోని ప‌లు విష‌యాల్లోనూ వైసీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింది. తాజాగా ఒక్కో విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంతో టీటీడీ అధికారులు కొండ‌పై సంప్రోక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు అవ‌శేషాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి రిపోర్టు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు మాత్రం వితండ‌వాదం చేస్తున్నారు.

మొద‌టి నుంచీ వారికున్న అల‌వాటు ప్ర‌కారం నిజాన్ని అబ‌ద్ధంగా మార్చేందుకు శ‌త‌ విధాల ప్ర‌య‌త్నాలు చేస్తు న్నారు. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి వైసీపీ ముఖ్య‌నేత‌లంతా మీడియా స‌మావేశాలు పెడుతూ చంద్ర‌ బాబుపై విరుచుకుప‌డ‌తున్నారు. చంద్ర‌బాబు తిరుమ‌ల శ్రీ‌వారిని రాజ‌కీయంగా వాడుకుంటూ.. హిందువుల మ‌నోభా వాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియాలో ల‌డ్డూ వ్య‌వ‌హారం అంతా చంద్ర‌బాబు కుట్ర‌లో భాగ‌మే అన్న‌ట్లు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా ప్రయత్నిం చేందుకు అడ్డ‌మైన దారుల‌న్నీ తొక్కేస్తున్నారు.

 వైసీపీ  హ‌యాంలో టీటీడీ చైర్మ‌న్లుగా ప‌నిచేసిన భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల వ్య‌వ‌హార‌శైలి మాత్రం ప్ర‌జ‌ల్లో అనుమానాల‌కు తావునిస్తోంది. క‌రుణాక‌ర్ రెడ్డి ఓవ‌రాక్ష‌న్ అయితే తార స్థాయికి చేరిపోయింది. గుమ్మ‌డి కాయ‌ల దొంగ భుజాలు త‌డుముకున్న‌ట్లుగా క‌రుణాక‌ర్ రెడ్డి తెగ కంగారుప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల‌కు వెళ్లి.. తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇక్క‌డ విచిత్రం ఏమిటంటే.. దేవుడంటే ఏ మాత్రం భక్తి లేని.. అన్యమతస్తుడు అయిన కరుణా కరరెడ్డి ప్రమాణం చేశారు. గతంలో తిరుమల శ్రీవారిని నల్లరాయితో పోల్చిన కరుణాకరరెడ్డి ప్రమాణం చేయడమే, తప్పు జరిగిందని అంగీకరించడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. తిరుమల వేంకటే శ్వరస్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తిగా  భూమన చెప్పుకుంటారు. కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు, భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అవును  స్వయంగా ఆయనే ఈ మాట అన్నారు. అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ  అవహేళన చేసిన చరిత్ర భూమనకు ఉందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్పుడు సోషల్ మీడియాలో  పాత  సంగతులను   గుర్తు చేస్తున్నారు. మ‌రోవైపు ఏపీ ప్రభుత్వం మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా పేరున్న పొన్న వోలు సుధాకర్ రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల ల‌డ్డూను త‌క్కువ చేస్తూ మాట్లాడ‌టంతో శ్రీవారి భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యి ఖరీదు కిలో రూ.320 కాగా.. అందులో రూ.1400 విలువచేసే పంది కొవ్వును ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మార్కెట్‌లో పందికొవ్వు ధర రూ.400 నుంచి రూ.1400 ఉందని చెప్పారు. నెయ్యి కంటే ఖరీదైన వస్తువుతో కల్తీ ఎలా చేస్తారన్నారు. రాగితో బంగారాన్ని కల్తీ చేయవచ్చు కానీ, బంగారంతో రాగిని కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

పొన్న‌వోలు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీ నేత‌ల‌కు తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంపై ఎంత చిన్న‌చూపో   అర్ధ‌మ‌వుతోంది. తాజాగా ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. గ్రామాల్లో అనేక పశువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి. అవి తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి పాలతో చేసే నెయ్యి వల్ల అలా జరుగుతుందంటూ కొత్త లాజిక్ చెప్పారు. వైసీపీ నేత‌ల విచిత్ర వాద‌న‌ల‌తో హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

తిరుప‌తి ల‌డ్డూ వివాదంలో త‌న‌కు ఏమీ తెలియ‌దు.. మేమంతా అమాయ‌కుల‌ం అన్న‌ట్లుగా జ‌గ‌న్, ఆయన పార్టీ నేతల తీరు ఉంది.  త‌ప్పుచేసి అడ్డంగా దొరికిన‌ప్ప‌టికీ త‌న అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా తాము ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ప్ర‌జ‌ల‌ను నిమ్మించ‌డంలో జ‌గ‌న్ మొద‌టి నుంచి దిట్ట‌. అయితే ఇప్పుడు జగన్ పప్పులు ఉడకటం లేదు.   తిరుపతి లడ్డూ వివాదం అంతా చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారమేనని ఆరోపిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి జగన్ లేఖ‌ రాశారు. అంతేకాదు.. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి దేశంలోని అన్ని పార్టీల అధినేత‌ల‌కు ట్యాగ్ చేశారు. ఒక‌ ప‌క్క కేంద్రం గుర్తింపు ఉన్న ల్యాబ్ నుంచే కాక‌.. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయింద‌ని తేల్చింది. జ‌గ‌న్ మెస‌లి క‌న్నీరును గుర్తించిన జాతీయ‌ రాజ‌కీయ పార్టీల  అధినేత‌లు జగన్ ప్రధానికి రాసి సోషల్ మీడియాలో తమకు ట్యాగ్ చేసిన లేఖను లైట్ గా తీసుకున్నారు. తన లేఖ‌  చ‌దివిన వెంట‌నే దేశంలోని రాజకీయ పార్టీల అధినేత‌లంతా స్పందిస్తారు.. ఇక చంద్ర‌బాబుకు గుణ‌పాఠం చెప్పొచ్చు.. చంద్ర‌బాబు బ‌య‌ట‌ పెట్టిన నిజాల‌ను అబ‌ద్దాలుగా మార్చేయ‌వ‌చ్చు అని జ‌గ‌న్ భావించారు. కానీ, జ‌గ‌న్ అంటే జాతీయ పార్టీల నేత‌ల్లో ఎవ‌రికీ న‌మ్మ‌కం లేద‌ని తేలిపోయింది. ఎవరూ జగన్ లేఖను పట్టించుకోలేదు. చివరాఖరికి జ‌గ‌న్‌తో మంచి సంబంధాలు ఉన్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై స్పందించ‌లేదు. దీంతో వైసీపీ నేత‌లు ఉసూరుమంటున్నారు.

By
en-us Political News

  
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.