జనాదరణలో అట్టడుగున జగన్!

Publish Date:Jul 13, 2022

Advertisement

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనాదరణ దారుణంగా పడిపోయింది. దేశంలోని 25 సీఎంలలో అట్టడుగు నుంచి ఆరో స్థానం జగన్ కు వచ్చింది.  సెంటర్ ఫర్ నేషనల్ ఓపీనియన్ సర్వే తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు జగన్ భవిష్యత్ ఏంటో తేల్చేశాయి. ముఖ్యమంత్రులకు జనంలో ఉన్న ఆదరణ అన్న అంశంలో సీఎన్ఓఎస్  నిర్వహించిన సర్వేలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో 11వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని  రాష్ట్రాల సీఎంలకు ప్రజల నుంచి ఆదరణ ఏ మేరకు ఉందనే అంశంపై సీఎన్ఓఎస్   ఇటీవల ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీ సీఎం వైఎస్ జగన్ 20వ స్థానంలో ఉన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేత అని, జనం నుంచి ఎంతో ఆదరణ ఉందంటూ జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్గాలు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాయి.

అయితే.. జగన్ ప్రభ వైసీపీ సొంత భజన చేసుకుంటున్నట్లుగా లేదని  పైపెచ్చు.. అసలు ఆయనకు జనాదరణే లేదనీ   తాజా సర్వేలో తేటతెల్లం చేసేసింది. ఏపీలో నిర్వహించిన సర్వేలో జగన్ నాయకత్వంపై 39 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.  29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 32 శాతం మంది తటస్థంగా ఉన్నారు. జగన్  అనుభవ రాహిత్యం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల  అభివృద్ధిని అగుడంటిందనీ, సంక్షేమ కార్యక్రమాల అమలులో కోతల వల్ల  జనామోదం అడుగంటిందనీ సర్వే తేల్చేసింది.  

ఏపీకి కొత్త పరిశ్రమలు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలు తరలిపోయే పరిస్థితులు ఉన్నాయనీ, విద్యుత్ తదితర సమస్యల వల్ల ఉన్న పరిశ్రమలలో కొత్త ఉద్యోగాలు రాకపోవడం,  ఉద్యోగులు, ఉపాధ్యాయులతో రగడ, రహదారుల దుస్థితి వంటి కారణాలతో  జగన్ పై జనంలో అసంతృప్తి గూడుకట్టుకుందన్నది సర్వే సారాంశం. ఇక ఈ సర్వే ఫలితాల్లో 11వ స్థానంలో నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 19 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సర్వేలో 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నిలిచిన ఒడిశా సీఎం విషయంలో ఆ రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంపై ఒడిశా ప్రజలు 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కేవలం 19 శాతం మంది మాత్రమే తమ సీఎం పట్ల ఒడిశా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దేశంలో అత్యంత జనాదరణ పొందిన తొలి ఐదుగురు సీఎంలలో 51 పాయింట్ల కచ్చితమైన ఆమోదంతో నవీన్ పట్నాయక్ నిలిచారు.  ఆ తరువాతి స్థానాల్లో వరుసగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇటీవలే రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ,  పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ సింగ్ మాన్ నిలిచారు. ఇక జగన్ తరువాతి  స్థానాల్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్, నాగాలాండ్ సీఎం నీఫూ రియో, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహ ఉన్నారు.  

By
en-us Political News

  
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.