పాస్‌బుక్ మీద ఫొటో... రైతుల ఓట్లు మటాష్!

Publish Date:May 4, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో కారణాలు వున్నప్పటికీ, చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవాల్సిన విషయం... రైతుల భూమి హక్కు పత్రం అయిన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ప్రచురించుకోవడం. తమ పూర్వికులు వారసత్వంగా ఇచ్చిన భూమి, తాము కష్టపడి సంపాదించుకున్న భూమి హక్కు పత్రాల పుస్తకం మీద జగన్ ఫొటో వుండటాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వున్నారు. అయితే బాహాటంగా వ్యతిరేకిస్తే వేధించి ఉసురు తీస్తారన్న భయంతో ఇంతవరకు ఎవరూ కిక్కురుమని కూడా అనలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా రైతులకు తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తమ పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో పోవాలంటే, జగన్‌ని గద్దెదించడం మినహా మరో మార్గం లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఎక్కడోదాకా ఎందుకూ, జగన్ నియోజకవర్గంలోని పులివెందులలోనే వైసీపీ కార్యకర్త అయిన ఓ రైతు సాక్షాత్తూ భారతి ముందే ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశాడంటే ఈ అంశం మీద రైతుల్లో ఎంత వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. అలా జగన్ ప్రభుత్వం కూలిపోగానే ఇలా పాస్ బుక్‌లో జగన్ ముఖాన్ని చించేయడానికి రైతులు సిద్ధంగా వున్నారు.

పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో వుండటం వల్ల రైతుల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని వైసీపీ నాయకులకు బాగా అర్థమైంది. రైతుల ఆస్తి మీద కూడా తన ఫొటోను ముద్రించుకోవాలనే దురాశకు రైతులు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలుసుకున్న నాయకులు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

By
en-us Political News

  
ఉన్నత విద్య, ఉద్యోగాల  కోసం విదేశాలకు వెళ్లి అర్థాంతరంగా తనువు చాలిస్తున్న భారత విద్యార్థుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 403 మంది భారత విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం  ఇటీవల వెల్లడించింది
ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. ఎక్క‌డా చిన్న బొట్టు ర‌క్తం కూడా కార‌లేదు. రాళ్లు రువ్వుకోలేదు.. పోలీసుల‌ను కూడా కొట్ట‌లేదు. క‌నీసం లాఠీ చార్జి ఘ‌ట‌న‌లు కూడా వెలుగు చూడ‌లేదు. మ‌రి అంత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లోనే అంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లుజ‌రిగిన‌ప్పుడు.. ఏపీలో ఎందుకు..
వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్ తోనే ఈ నినాదం కూడా మొదలౌతోంది. ఔను జగన్ ఎప్పుడో ఆరు నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి.. పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోది చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది.
వయసుతో పాటు అభిమానుల సంఖ్యనూ, సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌నీ పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రజినీకాంత్
ఈ ఎమ్మెల్యే చాలా మంచోడు ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు ఏడేళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసలు ఆయనను అరెస్టు చేయడానికి బయలు దేరారు.
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పతాకం రెపరెపలాడనుంది. దీనికి సింబాలిక్‌గా టీడీపీ ఫ్లాగ్ గ్రేట్ ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీ ప్రచార యుద్ధం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత చెలరేగిన హింసాకాండతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పందెం రాయుళ్ల దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచీ ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తి అయిన తరువాత నుంచీ ఈ నియోజవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు శుక్రవారం కొద్ది సేపు హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పక్కన పెడితే కొడాలి నానికి ఇంతకు ముందు నుంచీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే.
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పారిపోయిన సంగతి తెలిసిందే.
నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపురి సౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారని బుద్ధవనం కన్సల్టెంట్ మరియు ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-12
చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.