ఫోనే లేకుండా నంబరెక్కడిది జగన్ రెడ్డీ!

Publish Date:May 10, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాను చెప్పే అబద్ధాలు గోడకట్టినట్లు కాదు కదా కనీసం తడికె కట్టినట్లు కూడా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకురావడం, అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు కావడం జగన్ కు ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మారిపోయింది. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా జరిగిన గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఎన్నికలలో సానుభూతి లబ్ధి కోసం చేసిన ప్రయత్నం ఎలా బూమరాంగ్ అయ్యిందో తెలిసిందే.

గాయం తగిలిందంటూ డజను మంది డాక్టర్ల బృందంతో చికిత్స చేయించుకుని అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి, గాయానికి పెద్ద పట్టీ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించిన జగన్ ఆ పట్టీ తీసేయగానే నుదుటిపై గాయానికి సంబంధించి చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం వైద్య శాస్త్రంలోనే అద్భుతంగా అభివర్ణిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి.   తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తనకు ఫోనే లేదంటూ ఓ బ్రహ్మాండమైన విషయం వెల్లడించారు. జగన్ తనకు ఫోన్ లేదు అని చెప్పి నెటిజనులకు అడ్డంగా బుక్కైపోయారు. ఫోన్ లేదు అని చెప్పి ఊరుకోకుండా ఆయన ఒక వేళ ఫోన్ ఉన్నా ఆ ఫోన్ నంబర్ కూడా తనకు తెలియదని మరో  మాట అన్నారు. ఫోన్ లేకుండా నంబర్ ఎందుకు ఉంటుంది జగన్ భాయ్ అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.  

ఇంకా స్పష్టంగా జగన్ తన ఫోన్ బాగోతం ఎలా చెప్పారంటే... తన దగ్గర ఫోన్ లేదు అన్నారు. అలా అని ఊరుకోకుండా  ఫోన్ నంబర్ కూడా లేదు. అసలు నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు అని సాగదీశారు. ఫోనే లేకపోతే.. నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది సీఎం గారూ అని నెటిజనులు నిలదీస్తున్నారు. అదే సమయంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి మూడు రాజధానులు కట్టేసినట్లే లేని ఫోన్ కు కూడా నంబర్ ఉందేమో అంటూ జోకులేస్తున్నారు.  

అదే సమయంలో  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జగన్ తన అఫిడవిట్లో పోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ ఎ9849904123. ఫోన్ లేని జగన్ కు నంబర్ ఎలా వచ్చింది. అసలు తనకే తెలియని నంబర్ ను అఫిడవిట్లో ఎలా పేర్కొన్నారు.  అంటూ నెటిజనులు ప్రశ్నలు సంధిస్తుండటంతో అసలా ఇంటర్వ్యూ ఇవ్వనేల.. ఇచ్చితిని పో ఫోన్ బాగోతం గురించి చెప్పనేల? అంటూ జగన్  తల బాదుకుంటూ ఉండొచ్చు. 

By
en-us Political News

  
ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ  ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం. 
రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. బెంగుళూరు నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి  ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య  భూమిక వహించారు. 
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది.
చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గ పరిధిలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్లను మళ్లీ స్కృటినీ చేయాలనీ, అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆన సుప్రీం ను ఆశ్రయించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి.
అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ  ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది.
కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి.
వైసీపీ నుంచి అధికార పగ్గాలు చేజారిపోతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తన మౌఖిక ఆదేశాలతో పోలీసు శాఖను ఉరుకులు పరుగులు పెట్టించిన సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్‌ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.