ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మొదటికి వచ్చారు. కోర్టుకు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ ఏకంగా కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల లండన్ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చిన సందర్భంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని షరతు విధించింది. అప్పుడు ఆ షరతుకు ఓకే అన్న జగన్.. ఇప్పుడు దానిని ఉల్లంఘించడానికి రెడీ అయిపోయి..
కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ, ఒక వేళ ఆయన తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయితే.. అందుకు ప్రత్యేక మైన భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందనీ, అది తనకు ఇష్టం లేదు కనుకనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఆయన ఎంత వితండ వాదం చేస్తున్నారంటే.. కోర్టుకు హాజరు కావడం అన్నది ఆయన ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా చెబుతున్నారు. న్యాయవ్యవస్థ అంటే తనకు లెక్కలేదన్నట్లుగా ఆయన పిటిషన్ ఉంది. నిజంగా ఆయన కోర్టు హాజరు సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాల్సి ఉంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాట్ల విషయంలో ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పుష్కరంపైగా బెయిలుపై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ బెయిలు షరతులను సైతం ఉల్లంఘిస్తుండటం పట్ల న్యాయ నిపుణులలో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. పైగా తాను హాజరు కాను కనుక అవసరం అనుకుంటే కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే హాజరౌతానంటూ ఆ పిటిషన్ లో కోర్టుకే బంపరాఫర్ ఇచ్చారు. ఇక్కడే న్యాయనిపుణులు ఆయన పరామర్శల పేరిట దర్జాగా రాజకీయయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డు రాని భద్రత.. కోర్టుకు హాజరు కావడానికే అడ్డువచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-petition-in-cbi-court-25-209131.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.