జగన్నాటకం బయటపడిపోయింది!

Publish Date:Aug 9, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నది ఆయన అధికారంలో ఉన్న కాలంలో పదే పదే రుజువైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. పైకి ఏపీలో హింసాకాండ, తెలుగుదేశం కూటమి సర్కార్ వైసీపీ నేతలు, కార్యకర్తలపై దమనకాండకు పాల్పడుతోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో హస్తిన ధర్నా అంటూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తో  చేతులు కలిపేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిందనీ, తనకు ఏపీలో భద్రత లేదనీ ఆరోపిస్తూ పదే పదే బెంగళూరుకు వెడుతున్నారు. అయితే భద్రత అన్నది సాకు మాత్రమేననీ, ఆయన బెంగళూరు వెళ్లేది ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తో భేటీలకేననీ తేలిపోయింది.  జగన్ తాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా అవసం ఉన్నా లేకపోయినా.. కేంద్రంలోని మోడీ సర్కార్ కు మద్దతు పలికారు. బీజేపీ అగ్రనేతల అడుగులకు మడుగులొత్తారు. ఇదంతా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణ కోసమేనని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని వేటినీ ఖాతరు చేయలేదు. 

ఇప్పుడు పరిస్థితి మారింది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. అలా ఉన్నా కూడా జగన్ బీజేపీతో అంటకాగుతానంటే బీజేపీకి ఏం అభ్యంతరం ఉండదు కానీ, గతంలోలా ఆయనను అన్ని విషయాలలోనూ వెనకేసుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయం ఇప్పటికే స్పష్టమైంది కూడా. రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య చూపి బీజేపీ తనకు రక్షణ కవచంలా నిలబడేలా చేసుకోవాలని జగన్ భావించారు. ఇందు కోసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని రెండు సార్లు కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా వద్దకు రాయబారానికి పంపారు. అయితే ఆ రాయబారం ఫలించినట్లు కనబడదు. 
మరో వైపు అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం సీరియస్ అయ్యింది. అలాగే వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణ కూడా వేగం పుంజుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఏపీ హోంమంత్రి అనితతో భేటీ కావడంతో వివేకా హత్య కేసు విచారణ జోరందుకుంటుందన్న భావన వ్యక్తం అవుతోంది. 

వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకి వైసీపి బేషరతుగా మద్దతు ఇస్తూనే ఉంది. వైసీపి, బీజేపీల మద్య ఎటువంటి పొత్తు లేకపోయినా.. గత 5 ఏళ్ళుగా మోడీ   జగన్‌ అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులను యధాతధ స్థితిలో ఉంచేందుకు జగన్ ప్రదర్శించిన విధేయత కారణమైదనడంలో ఎటువంటి సందేహం లేదు.  అయితే ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. 

ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయ్యింది. ఇప్పుడు కూడా  వైసీపి మద్దతు ఇస్తే మోడీ ప్రభుత్వం కాదనదు, సంతోషంగా స్వీకరిస్తుంది.. కానీ గతంలోలా జగన్ తో క్విడ్ ప్రోకో బంధం కొనసాగించే పరిస్థితి మాత్రం లేదు. జగన్ కేసులను యధాతథ స్థితిలో ఉండే విధంగా కేంద్రం నుంచి సహకారం అందదు. ఇటీవల తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసి ట్రయల్ వేగవంతం చేయాలని ఆదేశించడమే ఇందుకు నిదర్శనం.  

దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నారు. అందుకే తన ఢిల్లీ ధర్నాకు కాంగ్రెస్ మిత్ర పక్ష నేతలను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు కొందరు ధర్నాకు వచ్చి జగన్ కు సంఘీభావం కూడా తెలిపారు. అందుకు ప్రతిగా వైసీపీ ఇప్పుడు లోక్ సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా తాను కాంగ్రెస్ గూటి పక్షినేనని చాటింది.  తద్వారా నేరుగా బీజేపీపై జగన్ యుద్ధం ప్రకటించారనే చెప్పాలి.   అయితే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, స్వయానా తనకు సోదరి అయిన షర్మిల తీవ్ర స్థాయిలో జగన్ పై సంధిస్తున్న విమర్శల బాణాలకు అడ్డుకట్ట వేయాలన్న షరతుపై కాంగ్రెస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాజకీయ వర్గాలు అంటున్నారు. ఆ విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి  డికె శివకుమార్ ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానంతో బేరసారాలు సాగించేందుకే జగన్‌ పదేపదే బెంగళూరు పర్యటిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే తాను బీజేపీని వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తానని చాటేందుకే   లోక్ సభలో  జగన్‌ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని అంటున్నారు.  లోక్‌సభలో మోడీ ప్రభుత్వాన్ని వైసీపి వ్యతిరేకించిన మర్నాడే అంటే  శుక్రవారం(ఆగస్టు 9) జగన్‌ మళ్ళీ బెంగళూరు బయలు దేశారు. ఈ సారి కూడా ఆయన డీకేతో భేటీ అవుతారు. ఈ భేటీలో షర్మిల దూకుడుకు ముకు తాడు వేసే విషయంలోనూ, అలాగే  కాంగ్రెస్, జగన్ ల పొత్తుకు సంబంధించి  ఒప్పందం ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.