Publish Date:Oct 25, 2024
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు రోడ్డున పడి చాలాకాలమే అయ్యింది. ఇప్పుడు జగన్ షర్మిలకు ఇచ్చిన షేర్లను కాల్ బ్యాక్ చేస్తానంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించడంతో అన్నా చెళ్లెళ్ల తగాదా ముదిరి పాకాన పడినట్లైంది. ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి గొడవలు సహజమే అంటే దీనిని జగన్ తేలిగ్గా కొట్టేయడానికి చేసిన ప్రయత్నం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ తో విఫలమైంది.
తల్లీ, చెల్లిని కోర్టుకు లాగిన అన్న ఎవరైనా ఉంటారా అంటూ ఆమె ఎలాంటి శషబిషలూ లేకుండా జగన్ ను నిలదీసింది. ఈ నేపథ్యంలోనే ఆమె వైఎస్ఆర్ అభిమానులకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన సోదరుడి తీరును గట్టిగా ఎండగట్టడమే కాకుండా సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ మీడియా, సోషల్ మీడియాలో జగన్ కు అనుకూలంగా ఇష్టారీతిగా వార్తలు వండి వారుస్తున్నారనీ, అందుకే వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేయడం తన బాధ్యతగా భావించి ఈ లేఖ రాస్తున్నానంటూ ఆమె పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాలలోనే ఆయన మనవలు నలుగురికీ సమాన వాటా ఉండాలని చెప్పారు. ఆ విషయం తమ కుటుంబ సభ్యులకే కాకుండా కేవీపీ, వైవీసుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి కుటుంబ సన్నిహితులకు కూడా తెలుసు అని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాకుండా అన్ని కుటుంబ వ్యాపారాలకూ జగన్ ఒక గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేశారు. తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడం కుమారుడిగా జగన్ బాధ్యత. కానీ ఆయన ఆ బాధ్యత విస్మరించారని షర్మిల ఆలేఖలో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-only-gaurfen-for-ys-famili-businesses-25-187393.html
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.