Publish Date:Oct 25, 2024
పరామర్శలు, ఓదార్పులలో వైసీపీ అధినేత, మాజా ముఖ్యమంత్రి జగన్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారు. ఆయన ప్రతి పరామర్శ, ప్రతి ఓదార్పు రాజకీయ ప్రయోజనంతోనే ముడిపడి ఉంటుంది. అసలు జగన్ రాజకీయ ప్రస్ధానం ఇలాంటి పరామర్శలతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన జగన్.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్ర చేపట్టారు. అది సుదీర్ఘంగా సాగింది. రోజులు, వారాలు, నెలలు కాదు ఏళ్ల తరబడి సాగింది.
సాధారణంగా ఎవరయినా చనిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఓదార్చి వస్తారు. కానీ మనిషి పోయిన ఏళ్ల తరువాత వెళ్లి పరామర్శ చేసి వస్తే ఏమనాలి. అసలు ఎవరు ఎవరిని పరామర్శిస్తున్నారన్న కన్ఫ్యూజన్ ఏర్పడేలా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. ఎన్నికలలో మైలేజ్ కోసమే అన్నట్లుగా ఆయన అప్పట్లో చేపట్టిన ఓదార్పు యాత్రలు ఫలితాన్ని ఇవ్వలేదు. 2014 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి. ఇప్పుడు జగన్ మళ్లీ ఓదార్పు లేదా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు ఏ కారణంతో చనిపోయినా జగన్ వెంటనే అక్కడ వాలిపోతున్నారు. నెత్తిన చేతులు పెట్టి, అలింగనం చేసుకుని మృతుల కుటుంబీకులను ఓదారుస్తున్నారు. పనిలో పనిగా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలూ గుప్పించేస్తున్నారు.
అలాగే గతానికి భిన్నంగా తన ఓదార్పు సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ప్రకటన అయితే చేస్తున్నారు కానీ.. ఆ సాయం తక్షణం అందించడం లేదు. సాధారణంగా ఎవరైనా ఓదార్పు, పరామర్శకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబానికి చేయదలచుకున్న సాయం చేసి వస్తారు. అయితే జగన్ రూటే సెపరేటు.. ఆయన ఘనంగా ప్రకటన అయితే చేస్తారు.. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు.
ఎనన్నికలలో పరాజయం తరువాత తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఎక్కువగా బెంగళూరులోనే మకాం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ఓదార్పుపర్యటనలకు మాత్రమే వస్తున్నారు. ఇటీవల గుంటూరులో మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల మాటసాయం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కు మాత్రం అందించలేదు. అలాగే అ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీలో 77 మంది అత్యాచారానికి గురయ్యారనీ, వారందరికీ పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాననీ కూడా ప్రకటించేశారు. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తారో మాత్రం చెప్పలేదు. విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించేశారు. అంతకు ముందు విజయవాడ వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. ఇలా ఆయన సాయం ప్రకటనలకే పరిమితమైంది కానీ బాధితులకు అందిన దాఖలాలు కనిపించడం లేదు. నిజానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రకటనతో పాటే సాయం కూడా అందజేయాలి. కానీ జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. ఆయన ఓదార్పు పరామర్శ అంతా ఉత్తుత్తి సాయం ప్రకటనలు.. ఊకదంపుడు ప్రసంగాలతోనే సరిపోతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-odarpu-only-words-no-help-25-187384.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.