ఉత్తుత్తి సాయం.. ఊకదంపుడు ప్రసంగం.. జగన్ రూటే సెపరేటు!

Publish Date:Oct 25, 2024

Advertisement

పరామర్శలు, ఓదార్పులలో వైసీపీ అధినేత, మాజా ముఖ్యమంత్రి జగన్ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటారు. ఆయన ప్రతి పరామర్శ, ప్రతి ఓదార్పు రాజకీయ ప్రయోజనంతోనే ముడిపడి ఉంటుంది. అసలు జగన్ రాజకీయ ప్రస్ధానం ఇలాంటి పరామర్శలతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత  కాంగ్రస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన జగన్.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి అంటూ ఓదార్పు యాత్ర చేపట్టారు. అది సుదీర్ఘంగా సాగింది. రోజులు, వారాలు, నెలలు కాదు ఏళ్ల తరబడి సాగింది. 

సాధారణంగా ఎవరయినా చనిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఓదార్చి వస్తారు. కానీ మనిషి పోయిన ఏళ్ల తరువాత వెళ్లి పరామర్శ చేసి వస్తే ఏమనాలి. అసలు ఎవరు ఎవరిని పరామర్శిస్తున్నారన్న కన్ఫ్యూజన్ ఏర్పడేలా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. ఎన్నికలలో మైలేజ్ కోసమే అన్నట్లుగా ఆయన అప్పట్లో చేపట్టిన ఓదార్పు యాత్రలు ఫలితాన్ని ఇవ్వలేదు. 2014 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అది వేరే సంగతి. ఇప్పుడు జగన్ మళ్లీ ఓదార్పు లేదా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో జగన్ మళ్లీ ఓదార్పు యాత్రలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎక్కడ ఎవరు ఏ కారణంతో చనిపోయినా జగన్ వెంటనే అక్కడ వాలిపోతున్నారు. నెత్తిన చేతులు పెట్టి, అలింగనం చేసుకుని మృతుల కుటుంబీకులను ఓదారుస్తున్నారు. పనిలో పనిగా అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలూ గుప్పించేస్తున్నారు. 

అలాగే గతానికి భిన్నంగా తన ఓదార్పు సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ప్రకటన అయితే చేస్తున్నారు కానీ.. ఆ సాయం తక్షణం అందించడం లేదు. సాధారణంగా ఎవరైనా ఓదార్పు, పరామర్శకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబానికి చేయదలచుకున్న సాయం చేసి వస్తారు. అయితే జగన్ రూటే సెపరేటు.. ఆయన ఘనంగా ప్రకటన అయితే చేస్తారు.. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. 

ఎనన్నికలలో పరాజయం తరువాత తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఎక్కువగా బెంగళూరులోనే మకాం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ఓదార్పుపర్యటనలకు మాత్రమే వస్తున్నారు.  ఇటీవల గుంటూరులో మరణించిన మహిళ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సందర్భంగా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల మాటసాయం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కు మాత్రం అందించలేదు. అలాగే అ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏపీలో 77 మంది అత్యాచారానికి గురయ్యారనీ, వారందరికీ పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాననీ కూడా ప్రకటించేశారు. అయితే ఆ ఆర్థిక సాయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తారో మాత్రం చెప్పలేదు.  విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించేశారు. అంతకు ముందు విజయవాడ వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. ఇలా ఆయన సాయం ప్రకటనలకే పరిమితమైంది కానీ బాధితులకు అందిన దాఖలాలు కనిపించడం లేదు.  నిజానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రకటనతో పాటే సాయం కూడా అందజేయాలి. కానీ జగన్  ఎప్పుడూ అలా చేయలేదు.  ఆయన ఓదార్పు పరామర్శ అంతా ఉత్తుత్తి సాయం ప్రకటనలు.. ఊకదంపుడు ప్రసంగాలతోనే సరిపోతుంది.  

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.