గెలిపించండి మంత్రిప‌ద‌విస్తా.. జ‌గ‌న్ తాయిలాల ప్ర‌క‌ట‌న‌!

Publish Date:Sep 3, 2022

Advertisement

ఎవ‌రు హోంవ‌ర్క్ త్వ‌ర‌గా పూర్తి చేస్తే వారికి చాక్లెట్ అంటూ త‌ల్లి, ఎవ‌రు ప‌రీక్ష బాగా రాస్తే వారికి  పుస్త కాలు ఫ్రీ అని హెడ్‌మాస్ట‌రు, ఎవ‌రు బాగా ఆడితే వాళ్లే కెప్టెన్ అని ఆట‌ల్లో పిల్ల‌ల‌కి తాయిలాలు ప్ర‌క‌టించి వారిని ఊరించ‌డం చూస్తూనే ఉంటాం. రాజ‌కీయాల్లోకి ఇది వ‌చ్చేసింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ద్వారా తెలి సింది.  ఎవ‌రు గెలిస్తే వారికి, ఎవ‌రిని గెలిపిస్తే ఆ విజేత‌కీ మంత్రిప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ తాయిలాల ప్ర‌చా రం మొద‌లెట్టారు. 

రాజ‌కీయాల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఎద‌గాల్సి ఉంటుంది. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఆయా ప్రాంతాల్లో వారికి కాస్తం త మంచిపేరు ఉండాలి, మంచి ఫాలోయింగ్ అవ‌స‌రం. అలాంటివారికి ఎలాగూ పెద్ద‌గా ప్ర‌చారం అవ‌స రం లేదు. కానీ ప్ర‌త్య‌ర్ధిని అనుస‌రించి ప్ర‌చారం గ‌ట్టిగానే చేయాల్సివ‌స్తుంది. కానీ గెల‌వ‌డానికి అభ్య‌ర్ధి లేదా అభ్య‌ర్ధిని గెలిపించి మ‌హా వీరాభిమానులు కాళ్లు చేతులు విరిగేలా ప‌నిచేసుకుని మెజారిటీ సాధిం చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి తోడు జ‌గ‌న్ కొత్త‌గా తాయిలాల ప‌ద్ద‌తి ఆరంభించారాయె. క‌నుక ఇపుడు గెలిచి తీరాలి. గెలిస్తే బ‌తిమాల‌కుండానే ఆయ‌న మంత్రిప‌ద‌వి ఇస్తాన‌ని హామీ కూడా ఇచ్చేశారు. అంటే ఇలా పార్టీని మంచి మెజారిటీతో నిల‌బెట్ట‌డానికి వ్యూహం అయిన‌ప్ప‌టికీ అది ఆ అభ్య‌ర్ధికి ఏ మేర‌కు నిజం గానే ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేది త‌ర్వాత చూడాలి. నానా అవ‌స్థాప‌డి గెలిచాక జ‌గ‌న‌న్న కాస్తా మొండిచేయి చూపితే ప‌డిన క‌ష్టంతో ఒళ్లుపులిసి, కాసులు పోయి ఇంటికి ప‌రిమితం కావాల్సి వ‌స్తుంది. 

రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది!  కానీ... వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గెలిస్తే నువ్వే మంత్రి. గెలిపిస్తే మీ నాయకుడికి మంత్రి పదవి ఇస్తా నం టూ నేతలను, కార్యకర్తలను ఊరిస్తున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు... పార్టీ బలహీనంగా ఉన్నచోట, గెలు పు సందేహాస్పదంగా ఉన్నచోటల్లా ‘గెలిస్తే మంత్రి పదవి నీకే’ అని మాట ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహం లో భాగంగా గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాపులు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమా వేశాలు నిర్వహిస్తున్నారు. మీ నాయకుడిని గెలిపించుకుని రండి.  మంత్రిని చేస్తా అంటూ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలకు చెబుతున్నారు. అస‌లే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంతో అవ‌మానాలు ఎదుర్కొ న్న‌వారు ఇపుడు ఎన్నిక‌ల్లో గెలిచేందుకు మ‌ళ్లీ ఇంటింటికీ వెళ్లి మొహం చూప‌డం క‌ష్ట‌మే. మ‌రి జ‌గ‌న‌న్న ఆశ‌పెట్టారు గ‌నుక అవ‌మానాలు, తిట్లూ ఒక లెక్కా అనుకుంటే అలాగే ముందుకు సాగిపోతారు, తిట్ల‌కంటే, అవ‌మానాల‌కంటే మంత్రిప‌ద‌వి అత్యుత్త‌మం అన్న‌ది రాజ‌కీయ‌ప్ర‌భోద క‌దా.  

ఉదాహ‌ర‌ణ‌కు కుప్పంలో భరత్‌ను గెలిపించుకు రావాలని, ఆయనను మంత్రిని  చేస్తానని  చెప్పారు. రాజాంలో  కంబాల  జోగులును గెలిపించుకుని వస్తే  ఆయనకూ మంత్రి  పదవి ఇస్తానని  తెలిపారు.  మీ నాయకుడిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాన‌ని జగన్‌ చెప్పడం ప్రసార మాధ్యమాల్లోనూ రావడం పరిపాటిగా మారింది.  

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రులయ్యే వీలుందని .. ముఖ్యమంత్రి జగన్  ఇస్తున్న హామీలు  చూస్తుంటే.. ఆ సంఖ్య  దాటేస్తుందని  వైసీపీ నేతలు అంటున్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు. ఎంతకైనా తెగించేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నట్లు భావిస్తున్నారు.  జగన్‌ మంత్రి పదవి హామీ ఇచ్చిన తర్వాతే కుప్పంలో చంద్రబాబును భరత్‌ వర్గం అడ్డుకునే ప్రయ త్నం చేసిందని రాజకీయవర్గాలు పేర్కొంటు న్నాయి.

గత ఎన్నికల సమయంలోనూ...ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల ఆశ చూపి... చివరికి చెయ్యివడం జగన్‌కు కొత్తేమీ కాదని గత అనుభవాలు చెబుతున్నాయని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. 2019 ఎన్ని కల ముందు కూడా ఇలాంటి హామీలు అనేక మందికి ఇచ్చారని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మె ల్యే సీటును ఆశించిన మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇస్తానని జగన్‌ హామీలు గుప్పిం చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. మంత్రిపదవి పక్కనపెడితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మె ల్సీ కూడా దక్కలేదు. 

తాజాగా 2023లో మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా పలు జిల్లాల్లో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంటూ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మ‌రి ఈ నేప థ్యంలో నాయ‌కుని హామీకి త‌లొగ్గి  వైసీపీ నేత‌లు ఏమాత్రం ఉత్సాహ‌ప‌డ‌తారో చూడాలి.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.