జగన్ కి ఆ వివరాలు ఎందుకు?

Publish Date:Dec 9, 2014

Advertisement

 

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, అప్పులు, ప్రణాళికేతర ఖర్చులు వంటి వివరాలు కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ వ్రాసారు. కేంద్రప్రభుత్వం తన ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారిక వెబ్ సైట్లో ఉంచుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో పెడుతున్నట్లయితే ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని సూచించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలపై అర్ధవంతమయిన చర్చలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తానీ వివరాలు కోరుతున్నానని, అందువల్ల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా తను కోరిన వివరాలను తనకు అందజేయాలని ఆయన ముఖ్యమంత్రిని లేఖలో కోరారు.

 

అయితే దానికి ఆర్ధిక మంత్రి చాలా ఘాటుగా బదులిచ్చారు. అనేక ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అటువంటి వివరాలు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. వీలయితే అతనే తన అక్రమాస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించి, తన అధికారిక వెబ్ సైట్లో కూడా ఆ వివరాలు పెడితే బాగుంటుందని సూచించారు. యనమల మంచి ధీటుగా, చాలా ఘాటుగానే జవాబు ఇచ్చారు.

 

అయితే జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కనుక ఆ వివరాలు కోరే హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ ఆయనకు నిజంగా ఆ వివరాలు కావలసి ఉండి ఉంటే, ఆయన ముఖ్యమంత్రికి ఈ విధంగా లేఖ వ్రాసే బదులు, ఒక ప్రజా ప్రతినిధి హోదాలో లేదా క్యాబినెట్ ర్యాంక్ హోదా అనుభవిస్తున్న ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సంబంధిత అధికారులకు నేరుగా లేఖ వ్రాసి ఉండేవారు. అప్పుడు వారు ఆయన కోరిన వివరాలను అందజేయడానికి నిరాకరిస్తే అప్పుడు ఆయన ఆ సంగతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి ఉంటే, ఆయనను ఎవరూ అనుమానించే, విమర్శించే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చును.

 

కానీ ఆయన ఉద్దేశ్యం ఆ వివరాలు సేకరించడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటువంటి సమాధానం ఏదో రాబట్టడమే కనుక ముఖ్యమంత్రికి లేఖ వ్రాసారు. ఆయన హించినట్లే ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఘాటుగా బదులిచ్చారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదో దాస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.

 

కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా పాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కనుకనే ఆయన క్రమంగా కాగితాలు, ఫైళ్ళ స్థానంలో కంప్యూటర్లను ప్రవేశపెడుతున్నారు. క్రిందటి సారి జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎక్కడా కాగితం ఉపయోగించకుండా కంప్యూటర్లతోనే ఆయన సమావేశం నిర్వహించారు. ఆ కంప్యూటర్లలో నిక్షిప్తమయిన వివరాలు అన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ పద్దతిలో ఆన్ లైన్లో భద్రపరిచారు. ఒకవేళ పాలనలో లొసుగులు, అక్రమాలు జరుగుతున్నట్లయితే ఎవరూ కూడా ఈ విధంగా వివరాలను కంప్యూటర్లలో భద్రపరిచే సాహసం చేయరని జగన్ కూడా గుర్తించవలసి ఉంది. అతను నిజంగా సభలో అర్ధవంతమయిన చర్చల కోసమే ఆ వివరాలు కోరి ఉండి ఉంటే ప్రభుత్వం ఆ వివరాలను క్షణాలలో అతనికి అందజేయగలదు. కానీ అతను ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లే ఉద్దేశ్యంతోనే ఈవిధంగా లేఖ వ్రాసి ఉండవచ్చనే అభిప్రాయంతోనే బహుశః యనమల ఆ విధంగా సమాధానం ఇచ్చి ఉండవచ్చును. ఏమయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలలో ఇది కూడా ఒక వివాదానికి దారి తీయవచ్చును. దీనిపై సభలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య వాగ్వాదం జరగడం తధ్యం.

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.