Publish Date:Aug 30, 2013
ఉస్మానియా ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంటే, అతనికి మరికొన్ని కొత్త కష్టాలుకూడా ఎదురవుతున్నాయి. తన భార్య భారతిని, తల్లి విజయమ్మను ఆసుపత్రిలో తనకు సహాయంగా ఉంచాలని కోరుతూ అతను సీబీఐ కోర్టుకి పెట్టుకొన్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. అతనిని కలవాలని వచ్చిన అతని భార్య భారతిని పోలీసులు లోనకి అనుమతించక పోవడంతో, ఆమె చాలా ఆందోళనకు గురయ్యారు. ఇక, జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వస్తున్న వార్తలతో ఆసుపత్రి వద్దకు చేరిన వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాల ఆందోళనతో, ఆవేశంతో ఉన్నారు.
వీటికి తోడు, జగన్ మోహన్ రెడ్డి తెలంగాణాను వ్యతిరేఖిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉన్న తెలంగాణావాదులు అతనికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయడానికి తాము అంగీకరించమని, అతనిని వెంటనే వేరే ఆసుపత్రికి తరలించాలని కోరుతూ ఆసుపత్రి ముందు ధర్నాలకు సిద్దపడుతుండటంతో, ఆసుపత్రి వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది.
బహుశః వైద్యులు కూడా వారి ఒత్తిళ్లకు లొంగినందునో ఏమో తమ ఆసుపత్రిలో అతనికి వైద్యం చేసేందుకు తగిన వైద్య పరికరాలు లేని కారణంగా అతనిని నీమ్స్ ఆసుపత్రికి తరలించడం మేలని వైద్యులు సూచించడంతో, పోలీసులు అతనిని మరికొంత సేపటిలో నీమ్స్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కానీ నీమ్స్ ఆసుపత్రి వద్ద కూడా అతనికి అదే పరిస్థితి ఎదురయితే అప్పుడు పోలీసులు ఏమి చేస్తారనేది మరో ప్రశ్న.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-mohan-reddy-39-25462.html
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు
క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ, ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు.
ఇప్పటి వరకూ అత్యధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్పటి వరకూ వరల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంతగా మరే దేశం శాసించలేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. తర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజయ పరంపర అందిపుచ్చుకుంది.
విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి?
హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్ డ్రైవ్ చేపడతామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు.